CSK: రుతురాజ్ పై ప్రశంసలు కురిపించిన స్టీఫెన్ ఫ్లెమింగ్!

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, పై ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు.  రితురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్‌గా ఉండడమే గొప్ప ఆస్తి అని అన్నాడు. 

New Update
CSK: రుతురాజ్ పై ప్రశంసలు కురిపించిన స్టీఫెన్ ఫ్లెమింగ్!

IPL 2024 ప్రారంభానికి ముందు ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే, అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను జట్టు కెప్టెన్‌గా నియమించారు. రుతురాజ్ గైక్వాడ్ ఇప్పుడు అనేక సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చాలా సందర్భాల్లో  MS ధోని తర్వాత అతను కెప్టెన్ అవుతాడని సీఎస్ కే అభిమానులు నిపుణులు అభిప్రాయపడ్డారు.ఇప్పుడు అదే నిజమైంది.  IPL 2019 లో CSK జట్టులోకి ప్రవేశించిన రుతురాజ్ ఇప్పటి వరకు 52 మ్యాచ్‌లు ఆడి 1797 పరుగులు చేశాడు.

CSK  మొదటి IPL మ్యాచ్‌కు ముందు రుతురాజ్ గైక్వాడ్‌పై స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా చేయడం వల్ల ఎలాంటి పెద్ద మార్పులు లేకుండా జట్టు సమతూకం మెరుగవుతుంది. అతను నాయకత్వ పాత్రను పోషించే అవకాశం కూడా పొందుతాడు. అతను చాలా కాలంగా జట్టు కోసం ఆడుతున్నాడు. జట్టుపై చాలా మంచి ప్రభావాన్ని కలిగి ఉన్నాడు. రుతురాజ్‌కి చాలా నమ్మకం ఉంది., కానీ అతని విధానం చాలా బాగుంది. క్రీడాకారులు అతన్ని గౌరవిస్తారు. అంతా ప్రణాళిక ప్రకారం జరిగేలా మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని సీఎస్ కే కోచ్ స్టీవ్ ఫెమ్నింగ్ అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTDలో నిజంగానే 100 ఆవులు చనిపోయాయా?: చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన!

TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ BR నాయుడు స్పష్టం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి కల్పిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను ఇక్కడివిగా చిత్రీకరిస్తున్నారన్నారు.

New Update
TTD Cows Death

TTD Chairman Reaction Over Cows Death

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిర్వహించబడుడున్న ఎస్వీ గోశాలలో దాదాపు 100 గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న ఆరోపించిన విషయం తెలిసిందే. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆ ఆవులు చనిపోతున్నాయని.. ఇది మహా అపచారం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవులకు సంబంధించిన ఫొటోలను సైతం కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరమన్నారు. శ్రీవారి సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం చాలా బాధాకరమనర్నారు.

గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్య సాధారణమన్నారు. వేదకాలం నుంచే గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నామన్నారు. ఏ ఒక్క గోవు యొక్క మృతి కూడా సామాన్యంగా తీసుకోలేమన్నారు. కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల  గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగ, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర ప్రాంతాల్లోని ఫొటోలను ఇక్కడివిగా..

ఇంకా దుర్మార్గంగా, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా  చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమన్నారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని కోరారు. గోసేవా అంటేనే గోదేవి సేవ అని అన్నారు. ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలన్నారు. శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ చేపడుతున్న గోరక్షణ, గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బలపడాలని ఆకాంక్షించారు. 

(br naidu ttd chairman | telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment