Bus Accident : ఆర్టీసీ బస్సు బోల్తా... 20 మంది ప్రయాణికులు! ప్రకాశం జిల్లాలో శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పంట కాల్వలో బోల్తాపడింది. By Bhavana 13 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Prakasam District : ప్రకాశం జిల్లాలో శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్సు (RTC Bus) బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. తూర్పు కొప్పెరపాడు, తూర్పు తక్కెలపాడు గ్రామాల మధ్య ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పంట కాల్వలో బోల్తాపడింది. అద్దంకి(Addanki) డిపోకు చెందిన ఏపీ 29 జెడ్ 1044 నంబరు గల ఆర్టీసీ బస్సు ఇంకొల్లు నుండి అద్దంకి వెళుతూ బోల్తా పడింది (Bus Accident). ఆ సమయంలో బస్సులో 20మంది ప్రయాణికులు, కండక్టర్ సురేష్ ఉన్నారు. ప్రయాణికులంతా ఒక్కసారిగా కేకలు వేస్తూ బస్సు నుండి బయటకు వచ్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని రేణింగవరం ఎస్ఐ కెకె తిరుపతిరావు పేర్కొన్నారు. also read: ఆహా.. అద్భుతమనిపిస్తున్న ఎవరెస్ట్ వీడియో #andhra-pradesh #bus-accident #prakasam-district #rtc-bus సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి