Big News: రైతులకు గుడ్ న్యూస్..వారి ఖాతాల్లో రూ. 10వేలు జమ..పూర్తి వివరాలివే.!

తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా చోట్ల చేతికి వచ్చిన పంట నీటిపాలైంది. వరి, నిమ్మ, బత్తాయి, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రేవంత్ సర్కార్ ముందుకు వచ్చింది. ఎకరాకు రూ.10వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.

New Update
Big News: రైతులకు గుడ్ న్యూస్..వారి ఖాతాల్లో రూ. 10వేలు జమ..పూర్తి వివరాలివే.!

Big News:  తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాలు వర్షాలు కురిసాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంట నీటిపాలైంది. కాంటకోసం కొనుగోళ్లు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం తడిసిముద్దయ్యింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు అక్కడి రైతన్నలు తీవ్రంగా పంట నష్టపోయారు. పలుచోట్ల వడగల్లవాన కురిసింది. ఇటు నల్లగొండ, పాలమూరు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. నిమ్మ, బత్తాయి, మామిడి, ధానిమ్మ కాయలన్నీ రాలిపోయాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతన్నలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10వేలు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి రూ. 15.81కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. లోకసభ ఎన్నికల కోడ్ సందర్భంగా ఈసీ అనుమతితో నేడో రేపో రైతుల ఖాతాల్లో జమ చేయన్నారు.

అయితే మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనా ఆధారంగా పంటనష్ట పరిహారం చెల్లిస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకు 15,246 మంది రైతులు 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. దీంతోపాటు ఆగస్టు 15వ తేదీ లోపు రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ కూడా చేస్తామని తెలిపారు. వీటితోపాటు రైతుభరోసా పథకం ద్వారా రూ. 15వేలు రైతుల అకౌంట్లో వానాకాలం సీజన్ నుంచి జమ కానుంది.

ఇది కూడా చదవండి: యూపీ ఎన్నికల్లో తెలంగాణ ఆడబిడ్డ సత్తా చాటేనా?..ఇంతకు ఎవరీ శ్రీకళా రెడ్డి..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment