Krishna : కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి! కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం శీతనపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. శీతన పల్లి వద్ద హైవే పై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరు లారీల డ్రైవర్లతో పాటు నలుగురు అందులో ప్రయాణిస్తున్న వారు మరణించారు. By Bhavana 14 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Road Accident In Krishna District : కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం శీతనపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు (6 People Dead). శీతన పల్లి వద్ద హైవే పై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరు లారీల డ్రైవర్లతో పాటు నలుగురు అందులో ప్రయాణిస్తున్న వారు మరణించారు. లారీ కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు వస్తుండగా, మరొకటి పుదుచ్చేరి నుంచి భీమవరం వైపు వస్తుంది. రెండు లారీలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా దారి మధ్యలో మరణించారు. మృతుల్లో ఐదుగురు పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా తాళ్లరేవుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. లారీలో మొత్తం పది మంది ప్రయాణికులున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదంతో ట్రాఫిక్ (Traffic) స్థంభించింది. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also read: మెగా డీఎస్సీపై ఏపీ సర్కార్ కీలక జీఓ! #andhra-pradesh #krishna-district #road-accident #bantumilli సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి