Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురి మృతి! ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రిక్షాను డంపర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయ పడ్డారు. By Vijaya Nimma 02 Apr 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Road Accident in Uttar Pradesh Chitrakoot: ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రిక్షాను డంపర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయ పడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం: నగరంలోని కొత్వాలి ప్రాంతంలోని అమన్పూర్ ప్రాంతం సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. డంపర్ లారీ వేగంగా వచ్చిన ఆటోను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆటోలో ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 8 మంది క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అందులో మార్గం మధ్యలోనే ఐదుగురు మరణించగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సిఎంఎస్ డాక్టర్ ఆర్బి లాల్ తెలిపారు. వీరిల్లో కూడా మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇది కూడా చదవండి: కేవలం రూ.1000తో పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్.. ఏడాదికి వడ్డీ ఎంతంటే? #chitrakoot #uttar-pradesh #road-accident సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి