Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురి మృతి!

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రిక్షాను డంపర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయ పడ్డారు.

New Update
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురి మృతి!

Road Accident in Uttar Pradesh Chitrakoot: ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రిక్షాను డంపర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయ పడ్డారు.  ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం:

నగరంలోని కొత్వాలి ప్రాంతంలోని అమన్‌పూర్ ప్రాంతం సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. డంపర్ లారీ వేగంగా వచ్చిన ఆటోను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆటోలో ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 8 మంది క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అందులో మార్గం మధ్యలోనే ఐదుగురు మరణించగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సిఎంఎస్ డాక్టర్ ఆర్‌బి లాల్ తెలిపారు. వీరిల్లో కూడా మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు.

ఇది కూడా చదవండి: కేవలం రూ.1000తో పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్‌.. ఏడాదికి వడ్డీ ఎంతంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు