Bus Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పి బోల్తాపడిన బస్సు..39 మంది ప్రయాణికులు!

నరాసరావుపేట మండలం పెట్లూరివారి పాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద అడ్డంగా పడిన చెట్టును తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా...మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

New Update
Bus Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పి బోల్తాపడిన బస్సు..39 మంది ప్రయాణికులు!

Ap: నరాసరావుపేట మండలం పెట్లూరివారి పాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద అడ్డంగా పడిన చెట్టును తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా...మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక నుంచి యానాం వైపు వెళ్తున్న తులసి ట్రావెల్స్ బస్సు..రోడ్డు పై పడిన చెట్టును తప్పించబోయి ఈ ప్రమాదానికి గురైంది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో విజయవాడకు చెందిన దివ్య అనే యువతి మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. తీవ్ర గాయాలైన వారిని చికిత్స కోసం నరసరావు పేటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read: కౌంటింగ్‌ ఏజెంట్లను టేబుళ్ల వద్దకు అనుమతిస్తాం: ఎలక్షన్‌ కమిషన్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు