Andhra Pradesh: అమరావతికి రూ.15,000 కోట్లు.. కేంద్రానికి ఆర్థిక మంత్రి పయ్యావుల రిక్వెస్ట్

విభజన వల్ల వచ్చిన ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి,గడిచిన 5 ఏళ్లలో ఆర్ధిక పరమైన తప్పులను సరిదిద్దాడానికి కేంద్ర సహకారం ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.ఢిల్లీలో జరిగిన ప్రీ బడ్జెట్‌, జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు.

New Update
Andhra Pradesh: అమరావతికి రూ.15,000 కోట్లు.. కేంద్రానికి ఆర్థిక మంత్రి పయ్యావుల రిక్వెస్ట్

Minister Payyavula Kesav: 2024 -2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుంచి సలహాలు, సూచనల స్వీకరణకు ప్రీ-బడ్జెట్ సమావేశం నిర్వహించారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పునర్నిర్మాణానికి రాష్ట్రాభివృద్ధి సహాయం (స్టేట్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్) కోరామని చెప్పారు మంత్రి పయ్యావుల కేశవ్. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా పునర్నిర్మించి, పునరుజ్జీవింపజేసే బృహత్‌ లక్ష్య సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వచ్చే కేంద్ర బడ్జెట్‌లో రూ. 15,000 కోట్లును అందుకు కేటాయించాల్సిందిగా కోరడం జరిగిందన్నారు.

రాష్ట్ర వ్యవసాయార్థిక జీవనాడి పోలవరం జాతీయ బహుళార్థసాధక ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరామన్నారు. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమంలో (స్పెషల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్) భాగంగా నిధులు కేటాయించాలని అడిగామని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్లు, పార్క్‌లకు ముఖ్యంగా 2 నోడ్‌లు విశాఖ-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లకు నిధులు కేటాయించాలని వివరించామన్నారు. మెగా టెక్స్‌టైల్‌ పార్క్, ఇంటిగ్రేటెడ్ అక్వా పార్క్‌లకు నిధులు, రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరామని పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం చేయూత అత్యవసరమనే విషయాన్ని వివరించామని తెలియజేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుస్థిర, సుధృడ నాయకత్వంలో రాష్ట్ర పునర్నిర్మాణం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. 2047 కల్లా వికసిత్ భారత్ సాధనలో త్వరితగతిన దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ మార్క్‌ను చేరడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించబోతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయడానికి సమయం పడుతుందన్నారు. ప్రజలు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తామని... అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

Also Read:Hyderabad: ప్రేమ జంటలే టార్గెట్‌..రెచ్చిపోతున్న పోకీరీలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Crime: ఓరి పాపిస్టోడా.. రూ.5 కోసం ముసలవ్వను కొట్టి కొట్టి చంపేశావ్ కదరా!

అన్నమయ్య జిల్లాలో శనివారం దారుణం జరిగింది. రూ.5 కోసం జరిగిన వివాదం వృద్ధురాలిని బలిగొంది. ఆటో ఎక్కిన గంగులమ్మ (70) తనకు రావాల్సిన రూ.5 తిరిగి అడిగింది. డ్రైవర్ ఇవ్వకపోవడంతో తిట్టింది. కోపగ్రస్తుడైన డ్రైవర్ ఆమెను కొట్టి కొట్టి చంపేశాడు.

New Update
Annamayya Madanapalle woman died after being attacked by an auto driver

Annamayya Madanapalle woman died after being attacked by an auto driver

ఏపీలో దారుణమైన ఘటన జరిగింది. 70 ఏళ్ల ముసలవ్వకు, ఆటో డ్రైవర్‌కు మధ్య రూ.5 కోసం జరిగిన వాగ్వాదం ఒకరి చావుకి కారణమైంది. ఆటో డ్రైవర్ రూ.5 ఎక్కువ తీసుకున్నాడని.. ముసలవ్వ నోరు పారేసుకుంది. అది సహించుకోలేని ఆటో డ్రైవర్.. ఏకంగా ఆమెను కానరాని లోకాలకు పంపించేశాడు. ఆ వృద్ధురాలిని కొట్టి కొట్టి చంపేసి రోడ్డుపై పడేశాడు. రన్నింగ్ ఆటోలోంచి కింద పడిపోయినట్లు కథ అల్లాడు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. 

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

రూ.5 గొడవకు ప్రాణం బలి

రూరల్ ఎస్సై గాయత్రి ప్రకారం.. రెడ్డెప్ప, గంగులమ్మ (70) దంపతులు. వీరు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలం, చంద్రాకాలనీలో ఉంటున్నారు. గాజులు, బొమ్మలను జాతరలో అమ్ముతూ జీవిస్తున్నారు. రెండు రోజుల క్రితం (శుక్రవారం) రాత్రి గంగులమ్మ అక్క లక్ష్మీ దేవి కుమారుడు వెంకటరమణ నీటితొట్టెలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని చికిత్స నిమిత్తం తిరుపతికి తీసుకెళ్లారు. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

దీంతో ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరమని గంగులమ్మ రూ.2 లక్షలు తీసుకుని బయల్దేరింది. ఇందులో భాగంగానే విష్ణు అనే వ్యక్తి షేర్ ఆటో ఎక్కింది. సీఎస్‌ఐ చర్చి వద్ద ఆమె దిగి ఆటో డ్రైవర్‌కు రూ.20 ఇచ్చింది. తిరిగి తనకు రూ.5 వస్తాయని అడిగింది. ఆ ఆటో డ్రైవర్ ఇవ్వకపోవడంతో ముసలవ్వ అతడ్ని తిడుతూ మళ్లీ ఆటో ఎక్కింది. అయితే తనను తిట్టడం అవమానంగా భావించిన ఆ ఆటోడ్రైవర్ బసినికొండ పంచాయతీలోని రామాచార్లపల్లె సమీపంలోకి తీసుకెళ్లి కొట్టి కొట్టి చంపేశాడు. 

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

ఆపై రోడ్డుపై పడేసి.. రన్నింగ్ ఆటోలోంచి దూకి చనిపోయినట్లు కథ అల్లాడు. ఇక ఈ విషయం తెలుసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. తమదైన శైలిలో ఆటో డ్రైవర్ విష్ణు విచారించడంతో అసలు నిజం బయటపడింది. అయితే ప్రస్తుతం గంగులమ్మ తీసుకెళ్లిన రూ.2 లక్షలు ఏమయ్యాయి అనే విషయంపై విచారిస్తు్న్నామని ఎస్ ఐ గాయత్రి తెలిపారు. 

(crime news | murder | latest-telugu-news | telugu-news | AP Crime | ap-crime-news)

Advertisment
Advertisment
Advertisment