Hyderabad : తమ్ముడూ మాకు 15సెకన్లు చాలు.. ఎంఐఎంపై బీజేపీ అభ్యర్ధి నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

2022లో హనుమాన్ చాలీసాతో సంచలనం సృష్టించిన బీజేపీ ఫైర్ బ్రాండ్, మాజీ నటి నవనీత్ కౌర్ ఎంఐఎం సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాకు 15 సెకన్లు మాత్రమే చాలు. సోదరిద్దరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అన్నది కూడా తెలియదు అంటూ నవనీత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
Hyderabad : తమ్ముడూ మాకు 15సెకన్లు చాలు.. ఎంఐఎంపై బీజేపీ అభ్యర్ధి నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

BJP MP Navaneet Sensational Comments : మహారాష్ట్ర(Maharashtra) లోని అమరావతి(Amaravati) కి చెందిన బీజేపీ(BJP) ఎంపీ నవనీత్ కౌర్(Navaneet Kaur) రాణా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్ధి మాధవీలత ప్రచారానికి వచ్చిన ఆమె ఎంఐఎం సోదరులపై వ్యాఖ్యలు చేశారు. పోలీసులు 15 నిమిషాల పాటు వెనుదిరిగితే.. మేమేం చేయగలమో చూపిస్తామని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.. కానీ మాకు 15 సెకన్లు మాత్రమే చాలు. సోదరిద్దరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అన్నది కూడా తెలియదు అంటూ నవనీత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వీటి మీద ఎంఐఎం నేతలు విరుచుకుపడుతున్నారు.

ఈసీ ఏం చేస్తోంది..

ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు రెచ్చ గొట్టే మాటలు మాట్లాడుతున్నారని ఎంఐఎం(MIM) నేతలు మండిపడుతున్నారు. ఇలాంటి వాటివల్ల రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని ఎంఐఎం ప్రతినిధి వారిస్ పఠాన్ అన్నారు. ఎన్నికల నిబంధనలను బీజేపీ నేతలు పదేపదే ఉల్లంఘిస్తున్నా...ఈసీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవనీత్ కౌర్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని వారిస్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ పాతబస్తీ నియోజకవర్గం నుంచి ఎంఐఎం తరుఫున అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తుండగా...బీజేపీ నుంచి మాధవీలత పోటీ పడుతున్నారు.

మాకో న్యాయం...వాళ్లకో న్యాయమా?

15 నిమిషాలు పోలీసులు ఉపసంహరించుకుంటే హిందువులందరినీ మట్టుబెడతామని అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు ఆయన ఎప్పుడో శిక్ష అనుభవించారు. స్వయంగా ఆయనే పోలీసకు లొంగిపోయారు. జైలులో కూడా ఉన్నారు. తరువాత 10 ఏళ్ళు పోరాడి నిర్దోషిగా బయటపడ్డారు. మరి ఇప్పుడు నవనీత్ కౌర్ మీద ఎన్నికల సంఘం చర్యలు ఎప్పుడు తీసుకుంటుందని ఎంఐఎం అధికార ప్రతినిధి వారిస్ ప్రశ్నించారు. రాజ్యాంగం అందరికీ సమానం. అందరినీ ఒకేలా ట్రీట్ చేయాలి. అప్పుడు అక్బరుద్దీన్‌ది తప్పు అయితే ఇప్పుడు నవనీత్‌ కౌర్‌ది కూడా తప్పే అవుతుంది కదా అని అడిగారు. బీజేపీ నేతలు రోజురోజుకూ ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

కాంట్రవర్శీ కామెంట్లకు కేరాఫ్ అడ్రస్...
నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతుకు ముందు కూడా ఇలాంటి మాటలు చాలానే సార్లు అన్నారు. అందుకే ఆమెనె బీజేపీ ఫైర్ బ్రాండ్ అంటారు.అంతకు ముందు ఈమె గుజరాత్‌లోని ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ జై శ్రీరాం అనడానికి ఇష్టపడని వారు పాకిస్థాన్‌కు వెళ్లవచ్చు. ఇది హిందుస్థాన్. మీరు హిందుస్థాన్‌లో ఉండాలనుకుంటే, మీరు జై శ్రీరామ్ అని చెప్పాలి అని అన్నారు. దీనిపై కూడా సోసల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. నెటిజన్లు ట్విట్టర్ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Also Read:Air India: ఇక ఇంట్లోనే ఉండండి..25మంది ఉద్యోగాలు పీకేసిన ఎయిర్ ఇండియా

Advertisment
Advertisment
తాజా కథనాలు