AI Technology : చాట్ జీపీటీకి పోటీగా జియో భారత్ జీపీటీ

ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా ట్రెండింగ్‌లో ఉందంటే అది ఏఐ. జనాలు దీంతో పిచ్చెక్కిపోతున్నారు. ఈ టెక్నాలజీతో వచ్చిన చాట్‌జీపీటీని అయితే తెగ వాడేస్తున్నారు. అందుకే దీనికి పోటీగా మన దేశం ముద్ర వేయడానికి వచ్చేస్తోంది జియో భారత్ జీపీటీ.

New Update
AI Technology : చాట్ జీపీటీకి పోటీగా జియో భారత్ జీపీటీ

Global Tech : ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్(AI) ప్రస్తుతం ప్రపంచాలన్ని ఏలుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు సైతం దీన్ని ఆధారంగా చేసుకుని ప్రాజెక్టులు చేస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలా బడా కంపెనీలు అన్నీ ఈ రంగంలోకి అడుగుపెట్టాయి. ఇప్పుడు మన దేశం నుంచి జియో కూడా ఇందులోకి ఎంటర్ అయింది. ఓపెన్ ఏఐ(Open AI) తోపాటు గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమకంటూ సొంత చాట్ బాట్‌లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వారి బాటలోనే అడుగులు వేస్తోంది జియో(Reliance Jio) టెలికం. ప్రపంచంలోని అతిపెద్ద భారతీయ కంపెనీలలో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ ఏఐ ఆధారిత వ్యవస్థలోకి తన ముద్ర వేయడానికి సిద్ధం అయింది. దీని కోసం ఐఐటీ-బాంబే తో కలిసి ‘భారత్ జీపీటీ’ను డెవలప్ చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. ముంబైలో జరిగిన ‘టెక్ ఫెస్ట్’లో ఈ విషయాన్ని తెలిపారు.

Also Read:బాబోయ్ ఇదేం చోద్యం..టీచర్, స్టూడెంట్ రొమాంటిక్ ఫోటో షూట్‌ వైరల్

చాట్ జీపీటీ తరహాలోనే భారత్ జీపీటీ కూడా కృత్రిమ మేధతో పనిచేస్తుంది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఒక విస్తృత సమాచార వ్యవస్థను రూపొందించడం భారత్ జీపీటీ లక్ష్యమని చెబుతున్నారు ఆకాశ్ అంబానీ. ఈ భారత్ జీపీటీని "జియో 2.0" అని పిలుస్తున్నారు. ఉత్పత్తులు, సేవలు ఇలా ప్రతి అంశంలో కృత్రిమ మేధ ప్రవేశించబోతోందని ఆకాశ్ అంబానీ వ్యాఖ్యానించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ప్రతి రంగంలో ఉత్పత్తులు, సేవల్లో పెను మార్పులు తేవొచ్చు. తమ సంస్థలోని అన్ని విభాగాల్లో ఏఐ సేవలను ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం అని ఆకాశ్ అంబానీ తెలిపారు. దీంతోపాటు టీవీల కోసం కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తేవడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. జియో 2.0పై ఇప్పటికే పనులు ప్రారంభించామని ఆకాశ్ అంబానీ తెలిపారు. రాబోయే పదేళ్ళను లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, జెనరేటివ్ ఏఐ నిర్వచిస్తాయని అభిప్రామం వ్యక్తం చేశారు. మీడియా స్పేస్, కామర్స్, కమ్యూనికేషన్ల రంగంలోనూ ఉత్పత్తులు, సర్వీసులను ఆవిష్కరిస్తామన్నారు.

Also Read : కోడికత్తి, బాబాయ్ మర్డర్ సినిమాలు కూడా తీయండి.. ఆర్జీవీకి లోకేష్ సలహా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam attack: మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలి.. కాల్పుల ముందు టెర్రరిస్ట్ మాటలు (VIDEO)

జమ్మూ కాశ్మీర్‌‌లో పర్యటకులపై ఫైరింగ్ ముందు టెర్రరిస్టులు వారితో మాట్లాడారు. పేరు, మతం అడిగి మహిళ కళ్లముందే ఆమె భర్తని చంపారు. అయితే ఆమెని కూడా చంపమని టెర్రరిస్ట్‌ను అడిగింది. జరిగింది మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలని ఉగ్రవాది అన్నట్లు తెలుస్తోంది.

New Update
Pahalgam attack 123

జమ్మూ కాశ్మీర్ టెర్రర్ అటాక్‌పై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాల్పులు జరిగిన సమయంలో టూరిస్టులతో ఉగ్రవాదులు మాట్లాడారు. పర్యటకులందరినీ తుపాకులతో బెదిరించి మోకాళ్లపై కూర్చోబెట్టారని ప్రత్యేక సాక్షులు మీడియాకు తెలిపారు. టూరిస్టుల పేరు, మతం అడిగి ముస్లింలు కానివారిని కాల్చి చంపారని ప్రత్యేక్ష సాక్షి పల్లవి చెబుతున్నారు. ఆమె భర్త తన పేరు మంజునాథ్ అని చేప్పగానే అతన్ని కాల్చి చంపారని ఆమె తెలిపారు. తనని కూడా చంపమని ఆమె ఉగ్రవాదులను వేడుకుందట. ఇక్కడ జరిగిందంతా మోదీకి చెప్పడానికి నువ్వు బతికే ఉండాలని ఓ టెర్రరిస్ట్ ఆమెతో అన్నాడని తెలుస్తోంది. టెర్రిస్టులు కాల్పులకు ముందు పర్యటకులతో మాట్లాడిని సంభాషణ గురించి సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ అవుతున్నాయి.

Also read: J&K Terror Attack: ‘పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు’

అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గామ్‌లో మంగళవారం సాయంత్రం టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 30మంది మృతి చెందారు. కాల్పుల్లో మరో 20 మంది గాయపడ్డారు. ది రెసిస్టెంట్ ఫ్రంట్(TRF) అనే ఉగ్రవాద సంస్థనే దాడి చేసినట్లు ప్రకటించింది. పక్కా ప్లాన్ ప్రకారమే ఉద్రవాదులు కాల్పులు జరిపారు. ఇండియన్ ఆర్మీ యూనిఫాంలో వచ్చి ఆకస్మాత్తుగా ఫైరింగ్ చేశారని ప్రత్యేక్ష సాక్షులు, క్షతగాత్రులు చెబుతున్నారు.

Also read: J&K Terror Attack : పాపం.. హనీమూన్కు వచ్చి కట్టుకున్న భర్తను కోల్పోయింది( Video Viral)

Advertisment
Advertisment
Advertisment