Jio: భారత్ లో శాటిలైట్ ఇంటర్నెట్.. జియో ప్లాట్ఫారమ్కు గ్రీన్ సిగ్నల్! ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ను ప్రారంభించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో ప్లాట్ఫారమ్లకు అనుమతి లభించింది. లక్సెంబర్గ్ SES భాగస్వామ్యంతో హై-స్పీడ్ ఇంటర్నెట్ వినియోగించుకునేందుకు స్పేస్ రెగ్యులేటర్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు రాయిటర్స్ నివేదించింది. By srinivas 13 Jun 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి JIO To Launch Satellite Internet: ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ను ప్రారంభించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో ప్లాట్ఫారమ్లకు అనుమతి లభించింది. లక్సెంబర్గ్ SES భాగస్వామ్యంతో హై-స్పీడ్ ఇంటర్నెట్ వినియోగించుకునేందుకు స్పేస్ రెగ్యులేటర్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు రాయిటర్స్ నివేదించింది. అమెజాన్, ఎలోన్ మస్క్ స్టార్లింక్ ప్రయత్నాలతో పాటు శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించేందుకు జియో ప్లాట్ఫారమ్ కూడా పోటీలో ఉంది. ఈ మేరకు ఆర్బిట్ కనెక్ట్ ఇండియాకు మూడు అనుమతులు మంజూరు చేయబడ్డట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అందులో జియో ఒకటిగా పేర్కొన్నారు. ఏప్రిల్, జూన్లలో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPAce) ఈ అనుమతులు జారీ చేయగా.. ఆర్బిట్ కనెక్ట్స్ ఉపగ్రహాలను భారతదేశం పైన ఉంచడానికి అనుమతిస్తాయి. ఇది ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ను అందిస్తుంది. Also Read: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఈ వివరాలు మీకు తెలుసా? #satellite-internet #jio-platforms #reliance సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి