PM MODI :‘ రీఫార్మ్, పర్ ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ ’’ నినాదంతో ముందుకెళ్లాం..17వ లోకసభ చివరి సమావేశంలో ప్రధాని మోదీ..!!

New Update
PM MODI :‘ రీఫార్మ్, పర్ ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ ’’ నినాదంతో ముందుకెళ్లాం..17వ లోకసభ చివరి సమావేశంలో  ప్రధాని మోదీ..!!

PM MODI : గత ఐదేళ్లలో అనేక మార్పులు, సంస్కరణలను తీసుకువచ్చామని తెలిపారు ప్రధాని మోదీ. పార్లమెంట్ సమావేశాల చివరిరోజు గురువారం లోకసభలో ఆయన ప్రసంగించారు. దేశ ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. ఈ సమావేశాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మోదీ వెల్లడించారు. రీఫార్మ్, పర్ ఫార్మ్, ట్రాన్స్ ఫార్మ్(Reform, per form, transform) లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా మార్పు కనిపిస్తోందన్న ప్రధాని కోవిడ్ సమయంలో ఎంపీలు తమ జీతాన్ని బాధితులకు ఇచ్చి ప్రజల్లో విశ్వాసం నింపారన్నారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించుకున్నామని..జీ 20 సమ్మిట్ ను నిర్వహించడం వల్ల మన భారతదేశ గౌరవం పెరిగిందన్నారు ప్రధాని మోదీ.

కొత్త పార్లమెంట్ భవనం మనకు గర్వకారణం:
ఎన్ని ఆటంకాలు ఎదురైనా దేశ అభివ్రుద్ధిని మాత్రం ఎవరూ అడ్డుకోలేదన్నారు. కొత్త పార్లమెంట్ భవనం మనకు గర్వకారణం నిలిచిందని చెప్పిన ప్రధాని మోదీ..ఈ ఐదేళ్ల కాలంలో అద్భుతమైన ఫలితాలు సాధించామని మోదీ తెలిపారు. ఈ ఐదేళ్ల డెవలప్ మెంట్ తో భారత్ సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు. భారత్ ఆతిథ్యం ఇచ్చిన జీ20 సమ్మిట్ ఎంతో విజయవంతం అయ్యిందన్నారు. డిజిటలైజ్ చేసి కాగిత రహిత పార్లెమంట్ గా తీర్చిదిద్దామన్నారు . కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించి ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చుకున్నామని తెలిపారు ప్రధాని మోదీ.

ట్రిపుల్ తలాక్ నిషేధం :
ట్రిపుల్ తలాక్ ను నిషేధించి ముస్లిం మహిళల హక్కులను కాపాడమన్నారు మోదీ. మహిళల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు నారీ శక్తి వందన్ చట్టం తీసుకువచ్చామని తెలిపారు. వచ్చే పాతికేళ్లు భారత్ కు ఎంతో కీలకమని మోదీ తెలిపారు. డెవలప్ చెందిన దేశంగా భారత్ ఆవిర్భవించనుందని..ప్రశ్నాపత్రాల లీకేజీ యువత పాలిట శాపంగా మారిందని మోదీ తెలిపారు. యువతకు అన్యాయం జరగకుండా గొప్ప నిర్ణయం తీసుకున్నామన్నారు. పేపర్ లీకేజీకి పాల్పడిన వారికి కఠిన శిక్షపడేలా చట్టం తీసుకువచ్చామని మోదీ వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చట్టాలను 17వ లోకసభ ఆమోదించిందని ప్రధాని అన్నారు.

370ఆర్టికల్ ను తొలగించాం :
డిటిజల్ డేటా ప్రొటెక్షన్ చట్టం భావి భారతానికి ఎంతో ఉపయోగమన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజలపక్షాన నిలబడ్డామని 370 ఆర్టికల్ ను తొలగించామని మోదీ పేర్కొన్నారు. మేం చేపట్టిన చర్యలతో రాజ్యాంగ నిర్మాతల ఆత్మలు సంతోషిస్తాయని మోదీ అన్నారు. అటు ముద్ర యోజన ద్వారా చిరువ్యాపారులకు రుణాలు ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. ట్రాన్స్ జెండర్లకు పద్మ పురస్కారాలను ఇచ్చి గొప్ప మార్పు దిశగా అడుగులు వేశామని మోదీ అన్నారు. ఇక పనిలోపనిగా విపక్షలపై సెటైర్లు కూడా వేశారు. ఎన్నికలకు సమయం దగ్గపడటంతో కొందరిలో అప్పుడే టెన్షన్ షూరూ అయ్యిందన్నారు.

ఇది కూడా చదవండి: ‘రామాయణం‘లో శూర్పణఖగా రకుల్..సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న బ్యూటీ..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు