Kolkata: కోలకత్తా డాక్టర్ రేప్.. అర్థరాత్రి దేశ వ్యాప్తంగా నిరసనలు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ డాక్టర్ రేప్ కేసులో న్యాయం జరగాలంటూ నిన్న అర్థరాత్రి చాలా నగరాల్లో నిరసనలు జరిగాయి. అర్థరాత్రి స్త్రీల స్వతంత్రం కోసం అంటూ రాత్రి 11.55 ని.లకు మహిళలు నిరసనలు చేశారు.

New Update
Kolkata: కోలకత్తా డాక్టర్ రేప్.. అర్థరాత్రి దేశ వ్యాప్తంగా నిరసనలు

Reclaim The Night: కోలకతాలో జూనియర్ డాక్టర్ రేప్, హత్యకు వ్యతిరేకంగా అర్ధరాత్రి మహిళలు వీధుల్లోకి వచ్చారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు, ఆసుపత్రులలో డాక్టర్లు నిరసనలు, ప్రదర్శనలు చేస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు దేశ స్వాతంత్ర దినోత్సవం నాడు...ఎప్పుడైతే దేశానికి స్వేచ్ఛ వచ్చిందో కరెక్ట్‌గా అదే సమయానికి మహిళలు రోడ్ల మీద నిరసనలు చేశారు. దేశంలో ప్రధాన నగరాన్నింటిలోనూ ఈ ఉద్యమం జరిగింది. స్వతంత్రం వచ్చిన అర్ధరాత్రి స్త్రీల స్వతంత్రం కోసం అని దీనిని అభివర్ణించారు.

ఈనిరసనల తాలూకా వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మహిళలు తిరిగి రాత్రి వేళల్లో ధైర్యంగా తిరగ గలగాలి అంటూ కొలకత్తా, ఢిల్లీలలో ర్యాలీలు చేశారు. వీటిని రీక్లైమ్ ది నైట్ ర్యాలీలంటారు. అంతకు ముందు 2012లో ఢిల్లీలో బస్సులో సామూహిక అత్యాచారం , హత్య జరిగినప్పుడు ఈ విధంగానే 'రీక్లైమ్ ది నైట్' నిరసనలు నిర్వహించారు.

Also Read:  Kolkata: ఆదివారంలోగా నిందితుడిని ఉరిశిక్ష తీయాలి..దీదీ అల్టిమేటం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్

ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు  ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది. 

New Update
ipl

DC VS MI

ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సూపర్ మ్యాచ్ లో ముంబయ్ విజయం సాధించింది. ఈరోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయ్ ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఎమ్ఐ 12 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన డీసీ బ్యాటింగ్‌కు దిగిన  19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఢిల్లీ బ్యాటర్ కరుణ్‌ నాయర్‌  40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కర్ణ్‌ శర్మ 3, దీపక్‌ చాహర్‌ 1, బుమ్రా 1, శాంట్నర్‌ 1 వికెట్లు తీశారు. ముంబయ్ కు ఇది రెండో విజయం.

భారీ స్కోర్ ఇచ్చిన ముంబయ్..

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ 38 పరుగులతో రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మకేశ్ ఓ వికెట్ తీశారు. చివరి ఓవర్లో 11 రన్స్ చేశారు ముంబయ్ బ్యాటర్లు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(18) మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో విప్రజ్‌ వేసిన చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో నమన్ దూకుడుగా ఆడి ముంబయ్ ఎక్కువ స్కోరు వచ్చలా చేశాడు. ఢిల్లీ  బౌలర్లలో విప్రజ్‌, కుల్దీప్‌ రెండేసి వికెట్లు.. ముకేశ్‌ ఒక వికెట్‌ తీశారు.    

today-latest-news-in-telugu | IPL 2025 | dc | delhi | mumbai-indians

Also Read: DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

Advertisment
Advertisment
Advertisment