Ration shop: రేషన్ కార్డు దారులకు మోదీ శుభవార్త.. అందుబాటులోకి మరిన్ని సరుకులు!

రేషన్‌ షాపులను జన్‌ పోషణ్‌ కేంద్రాలుగా మార్చబోతున్నట్లు మోదీ సర్కార్ ప్రకటించింది. పేదలకు పోషకాలు అందించడంతోపాటు రేషన్‌ డీలర్ల ఆదాయం పెంచేందుకు పైలట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించినట్లు మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. నిత్యవసర సరుకుతోపాటు పాల ఉత్పత్తులు విక్రయించనున్నారు.

New Update
Ration shop: రేషన్ కార్డు దారులకు మోదీ శుభవార్త.. అందుబాటులోకి మరిన్ని సరుకులు!

Jan Poshan: దేశంలోని పేదలకు మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. రేషన్‌ షాపులను (FPS) జన్‌ పోషణ్‌ కేంద్రాలుగా మార్చబోతున్నట్లు ప్రకటించింది. బియ్యం, ఉప్పు, పప్పులతో పాటు విభిన్న రకాల పోషక ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు లబ్ధిదారులకు పోషకాలు అందించడంతోపాటు రేషన్‌ షాప్‌ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పైలట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించినట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు.

60 రేషన్‌ షాపులను జన్‌ పోషణ్‌ కేంద్రాలుగా..
ఇందులో భాగంగానే మేరా రేషన్‌ యాప్‌ అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ను పరిచయం చేసిన జోషి.. తెలంగాణ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రాంతాల్లోని 60 రేషన్‌ షాపులను జన్‌ ఫోషణ్‌ కేంద్రాలుగా మార్చనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఎఫ్‌పీఎస్‌లు 8- 9 రోజులు మాత్రమే తెరుస్తున్నారు. మరికొన్ని 3 నెలలకు ఒకసారి మాత్రమే పనిచేస్తాయి. మిగతా టైమ్ లో దుకాణాలు అందుబాటులో ఉండట్లేదు. దీంతో డీలర్లకు కమీషన్లు సరిపోవట్లేదు. దీనికి ప్రత్యామ్నాయం కోసం కొత్త విధానాలు ప్రవేశపెట్టాల్సి ఉందని జోషి అన్నారు.

ఇది కూడా చదవండి: Rape case: బాలికలు లైంగిక కోరికలు తగ్గించుకోవాలన్న హైకోర్టుకు సుప్రీంకోర్టు చురకలు!

ఈ దుకాణాల్లో రోజువారీ నిత్యవసర సరుకులైన చిరుధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి. అదే విధంగా డీలర్ల అదనపు ఆదాయాలకోసం ఎఫ్‌ఎమ్‌సీజీ విభాగంలో మొత్తం 3,500 ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికీ దేశంలో 5.38 లక్షల ఎఫ్‌పీఎస్‌లు వినియోగంలో ఉన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Air India flight: విమానంలో పక్క ప్యాసింజర్‌పై మూత్రం పోసిన వ్యక్తి

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఓ వ్యక్తి తోటి ప్యాసింజర్ పై మూత్ర విసర్జన చేశాడు. AI 2336 లోని బిజినెస్ క్లాస్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. జరిగిన దానికి ఆ వ్యక్తి ప్రయాణికుడిని క్షమాపణ కోరారు.

New Update
Air India flight 123

Air India flight 123

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బిజినెస్ క్లాస్‌లో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఎయిర్ ఇండియాకు చెందిన AI 2336 లోని బిజినెస్ క్లాస్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. ప్యాసింజర్ వికృత ప్రవర్తనకు ఫ్లైట్‌లో ప్రయాణికులందరూ అసహించుకున్నారు. అయితే జరిగిన దానికి ఆ వ్యక్తి క్షమాపణలు కోరాడు.

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

ప్రయాణీకుడు బిజినెస్ క్లాస్‌లోని 2D సీటులో కూర్చుని సమీపంలో కూర్చున్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. బాధిత ప్రయాణీకుడు ఈ సంఘటనకు సంబంధించి ఇంకా ఫిర్యాదు చేయనప్పటికీ, నిందితుడు తన చర్యలకు క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సంస్థ అధికారులు తెలిపారు. పక్క వ్యక్తిపై యూరిన్ పోసిన ప్యాసింజర్ పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అట. దీనిపై బ్యాంకాన్ వెళ్లాక కంప్లెయింట్ ఇస్తానని బాధిత ప్రయాణికుడు ఫ్లైట్ సిబ్బందికి తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment