రాజిరెడ్డి చనిపోలేదు.. అది పాత వీడియో అంటున్న మాజీ మావోలు

మావోయిస్టు ఆగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతిపై మాజీ మావోయిస్టులు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజిరెడ్డి చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఆయన చనిపోయినట్లు సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియో పాతదని తెలిపారు

New Update
రాజిరెడ్డి చనిపోలేదు.. అది పాత వీడియో అంటున్న మాజీ మావోలు

మావోయిస్టు ఆగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతిపై మాజీ మావోయిస్టులు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజిరెడ్డి చనిపోలేదని, ఆయన చనిపోయినట్లు సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తలు పాతవని స్పష్టం చేశారు. ఇటీవల సోషల్‌ మీడియాలో ఉన్న మృతదేహం దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు హరఖ్‌ అలియాస్‌ శ్రీకాంత్‌గా మాజీ మావోయిస్టులు తెలిపారు. మావోయిస్ట్ శ్రీకాంత్‌ 2012లోనే అనారోగ్యంతో మరణించాడని వెల్లడించారు. మావోయిస్ట్ పార్టీ అప్పటి వీడియోను ఇప్పుడు విడుదల చేసిందని, దీనీ వల్ల మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సాయన్న అలియాస్‌ మీసాల సత్తెన్న మృతిచెందాడని మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. దీనిపై మావోయిస్టు పార్టీ ప్రకటప విడుదల చేస్తేనే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది.

కాగా గత రెండు రోజు క్రితం మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సాయన్న మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ నుంచి వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేయడంతో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అనారోగ్యం భారిన పడి మృతి చెందాడని పోలీసులు దృవీకరించారు. మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా మంథని మండల పరిధిలోని శాస్త్రులపల్లి. మల్లారెడ్డి గతంలో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా దండకారణ్యంలో కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. సంగ్రామ్‌, సాయన్న, మీసాల సాయన్న, అలోక్‌, అలియాస్‌ దేశ్‌పాండే, సత్తెన్న వంటి పేర్లతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది.

రాజారెడ్డికి స్నేహాలత అనే కూతురు ఉంది. ఆమె తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్‌లో పనిచేస్తున్న కాలంలో స్నేహాలత ఉద్యమ సహచరుడు, ఓయూ ప్రొఫెసర్ కాశీంను పెళ్లి చేసుకున్నారు. గతంలో తెలంగాణ పోలీసులు కాశింను అరెస్ట్‌ చేసి ఆయన ఇంట్లో మావోయిస్టుల చెందిన పుస్తకాలను, పెండ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bus Accident: వరంగల్‌లో బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు దగ్గర టీఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయాలు కాగా.. మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

New Update
TSRTC bus overturning accident

TSRTC bus overturning accident

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు దగ్గర టీఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయాలు కాగా.. మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి.  ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Also Read :   Alekhya Chitti Pickles Issue: మమ్మల్ని రోడ్డుపైకి లాగేశారు కదరా.. మా అక్కకి ఏదైనా జరిగితే - రమ్య వీడియో వైరల్

TGSRTC Warangal Bus Accident

 

ఇది కూడా చదవండి:  పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!

క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బస్సు ఒంగోలు నుంచి ఆదిలాబాద్‌ వెళ్తుండగా  ప్రమాదం చోటు చేస్తుంది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి

Also Read :  Allu Arjun - Atlee Movie: బట్టలు చించుకునే టైం ఆగయా.. హాలీవుడ్ రేంజ్‌లో అల్లు అర్జున్ - అట్లీ మూవీ (వీడియో చూశారా)

latest-telugu-news | today-news-in-telugu | telangana crime news | telangana crime case | telangana-crime-updates

Advertisment
Advertisment
Advertisment