T20 World Cup: టీ20 ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు? మ్యాచ్ రద్దయితే విజేతను తేల్చేదెలా?

ఇవాళ ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. ఇవాళ మ్యాచ్ జరుగుతున్న ప్లేస్‌లో వర్షం పడే సూచన ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే విజేతను ఎలా నిర్ణయిస్తారు?

New Update
T20 World Cup: టీ20 ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు? మ్యాచ్ రద్దయితే విజేతను తేల్చేదెలా?

టీ20 ప్రపంచప్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్, కెన్సింగ్టన్ ఓవల్‌లో జరగనుంది. అక్కడి సమయం ప్రకారం ఉదయం 10.30 గంటకు, భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమితి గంటలకు మ్యాచ్ రగనుంది. అయితే ఇప్పుడు ఈ ఫైనల్స్ మీద వర్ష మేఘాలు కమ్ముకున్నాయి. అక్కడా వాతావరణ పరిస్థితులను బట్టి మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ సూచించింది.తెల్లవారుజామున 3 నుంచి 10 గంటల వరకు దాదాపు 50 శాతం వర్షం కురిసే అవకాశం ఉండగా, ఉదయం 11 గంటలకు తుపానుతో కూడిన వర్షం కురిసే అవకాశం 60 శాతం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ తెలిపింది.

ఒకవేళ వాతావరణశాఖ చెప్పినట్టే జరిగితే ఫైనల్ మ్యాచ్ జరుగుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ మ్యాచ్ సమయం ఉండగానే వర్షం కురిసి పిచ్ తడి ఆరిపోతే అప్పుడే నిర్వహిస్తారు. అలాకాని పక్షంలో టైటిల్ మ్యాచ్ కోసం ఐసీసీ రిజర్వ్‌ డే ఉంచింది. జూన్ 29న మ్యాచ్ జరగకోతే...౩౦వ తేదీన జరుగుతుంది. మ్యాచ్ కోసం అదనంగా 190 నిమిషాల సమయాన్ని కేటాయించింది ఐసీసీ. రెండు రోజుల పాటు ఇది అమల్లో ఉంటుంది. ఒకవేళ మ్యాచ్‌ శనివారం ప్రారంభమై మధ్యలో ఆగిపోతే.. ఆదివారం అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. ఒకవేళ రిజర్వ్‌ డే కూడా వర్షం పడితే మాత్రం రెండు జట్లనూ విజేతలుగా ప్రకటిస్తారు.

ఇప్పటివరకు జరిగిన మొత్తం వరల్డ్‌కప్‌లో భారత్, సౌత్ ఆఫ్రికా రెండు జట్లూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్‌కు నేరుకున్నారు. వన్డే ప్రపంచప్‌లో చివరి నిమిషంలో కప్‌ను చేజర్చుకున్న టీమ్ ఇండియా ఇప్పుడు టీ 20 కప్‌ను సాధించి కసి తీర్చుకుందామని చూస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికా మొదటిసారి కప్‌ను గెలుచుకుని తమ మీద ఉన్న చోకర్స్ ట్యాగ్‌‌ను తొలగించుకోవాలని అనుకుంటోంది.

Also Read:Cricket: రికార్డ్‌లలో మాకు సాటే లేదంటున్న రోహిత్, బుమ్రా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: 90 రోజులు టారీఫ్ లకు బ్రేక్..అంతా ఒట్టిదే..వైట్ హౌస్

ట్రంప్ టారీఫ్ ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు సుంకాలను ఆపేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని వైట్ హౌస్ కొట్టిపడేసింది. టారీఫ్ లను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 

New Update
us

White House

 ప్రతీకార సుంకాలను ఆపేది లేదని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైట్ హౌస్. ఏది ఏమైనా టారీఫ్ లను కొనసాగిస్తామని చెప్పారు. మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు అన్నారు. అయితే ఏ దేశమైనా టారీఫ్ ల మీద చర్చకు వస్తే తాము సుముఖంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయాలని ఆలోచిస్తున్నారనే వార్తలను వైట్ హౌస్ ఖండించింది. దానిపై వస్తున్న వార్తలన్నీ నకిలీవి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. 

 

ఒక్క పోస్ట్ తో అంతా తారుమారు..

నిన్న ఎక్స్ లో వాల్టర్ బ్లూమ్ బెర్గ్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హాసెట్,  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజుల సస్పెన్షన్ గురించి ఆలోచిస్తున్నారని పోస్ట్ లు వచ్చాయి. దీంతో మార్కెట్లో గందరగోళం మొదలైంది.  ఈ ఒక్క పోస్ట్ తో స్టాక్ మార్కెట్ హెచ్ థగ్గులకు గురైంది. దీని గురించే ఈరోజు వైట్ హౌస్  మాట్లాడింది. హాసెట్ చెప్పినదాన్ని జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ కు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ చర్చ అంతా బిలియనీర్ హెడ్జ్ ఫండ్ పెట్టుబడిదారుడు, ట్రంప్ మద్దతుదారుడు అయిన బిల్ అక్మాన్ ఆదివారం ట్రంప్ అసమాన సుంకాల ఏర్పాట్లను పరిష్కరించడానికి, దేశానికి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడానికి "90 రోజుల గడువు" అమలు చేయాలని సూచించిన తర్వాత చర్చ ప్రారంభమైంది.

 today-latest-news-in-telugu | usa | donald trump tariffs | white-house

Also Read: RCB VS MI: ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది

Advertisment
Advertisment
Advertisment