Naga Vamsi : 'దేవర' సెకండ్ సింగిల్ పై ట్రోల్స్ .. స్పందించిన నిర్మాత, దేనితో కంపేర్ చేస్తే మనకేంటి అంటూ..!

'దేవర' లేటెస్ట్ సాంగ్ పై వస్తున్న ట్రోల్స్ పై నిర్మాత నాగవంశీ ఎక్స్ వేదికగా స్పందించారు.' గత 24 గంటల నుచి ‘చుట్టమల్లే’ సాంగ్ లూప్‌లో ఉంది.తారక్ అన్నని చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఎవరు దేనితో కంపేర్ చేస్తే మనకేంటి బాయ్స్” అంటూ పేర్కొన్నారు.

New Update
Naga Vamsi : 'దేవర' సెకండ్ సింగిల్ పై ట్రోల్స్ .. స్పందించిన నిర్మాత, దేనితో కంపేర్ చేస్తే మనకేంటి అంటూ..!

Devara Second Single Trolls : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'. ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సెకండ్ సాంగ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న సాయంత్రం దేవర సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. 'చుట్టమల్లే' అంటూ సాగే ఈ సాంగ్ ఆడియన్స్ నుంచి ,మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇది కాపీ సాంగ్ అని, లిరిక్స్ ఏమాత్రం అర్ధం కాలేదని, సాంగ్ లో తారక్, జాన్వీ మధ్య కెమిస్ట్రీ బాగున్నా.. డ్యాన్స్ ఆశించిన స్థాయిలో లేదనే కామెంట్స్ వినిపించాయి.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సెకండ్ సాంగ్‌పై విమర్శలు, ట్రోల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ పాటని శ్రీలంక హిట్ సాంగ్ 'మనికే మనహేతే' అనే దానితో పోలుస్తున్నారు. రెండింటి ట్యూన్స్ చాలా దగ్గరగా ఉన్నాయని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ పై వస్తున్న ట్రోల్స్ పై నిర్మాత నాగవంశీ ఎక్స్ వేదికగా స్పందించారు.

Also Read : సినిమా ఇండస్ట్రీ ఒకరి సొత్తు కాదు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

" గత 24 గంటల నుచి 'చుట్టమల్లే' సాంగ్ లూప్‌లో ఉంది. హౌ ఈజ్ ద జోష్ బాయ్స్? తారక్ అన్నని చూస్తుంటే ముచ్చటేస్తోంది. జాన్వీని చూస్తుంటే ముద్దొచ్చేస్తోంది. ఇంకా ఎవరు ఎలా అనుకోని, దేనితో కంపేర్ చేస్తే మనకేంటి కదా బాయ్స్" అంటూ పేర్కొన్నారు . దీంతో నాగవంశీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. కొరటాల శివడైరెక్ట్ చేసిన ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో దేవర పార్ట్ -1 ప్టెంబరు 27న థియేటర్లలోకి సందడి చేయనుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment