Telangana Elections 2023:ఫ్యూచర్‌లో బీఆర్ఎస్‌ను మ్యూజియంలో చూస్తారు-ప్రియాంక గాంధీ

New Update
Priyanka Gandhi: బీజేపీని  బొంద పెట్టాలి.. తెలంగాణ పర్యటనలో ప్రియాంక గాంధీ ఫైర్

మహబూబాబాద్ జిల్లా తొరూరు డివిజన్ కేంద్రంలో పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి ఎన్నికల ప్రచార కాంగ్రెస్ విజయభేరి సభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ ఏర్పాటు అయ్యేదికాదని అన్నారు. ఎవరి భాగస్వామ్యం లేకుండానే మానవత్వంతో ప్రజల కోరిక మేరకు సోనియా తెలంగాణను ఇచ్చారని ప్రియాంక చెప్పారు. గత పదేళ్ళల్లో తెలంగాణలో ఒక్క హైదరాబాద్ లో తప్ప ఇంకెక్కడా అభివృద్ధి జరగలేదని విమర్శించారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని..బీఆర్ఎస్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేదని ఆరోపించారు.

Also Read:పటాన్‌చెరులో కాంగ్రెస్‌ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ కు బిగ్ షాక్

తెలంగాణలో యువత ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రియాంక అన్నారు. TSPSC అంతా అవినీతి మయం. విద్యాసంస్థే పేపర్లు అమ్ముకోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఒక్క కుటుంబంలో నలుగురుకి మాత్రమే ఉద్యోగాలు దొరికాయని దుయ్యబట్టారు. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడికి మాత్రమే ఉపాధి దొరికిందన్నారు. కానీ సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ లు కోరుకుంది ప్రజల తెలంగాణా సంక్షేమం...అది మాత్రం నెరవేరలేదు అన్నారు ప్రియాంక.

ఫార్మ్ హౌస్ ఒక్కటే తెలంగాణ కాదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని ప్రియాంక యద్దేవా చేశారు. తెలంగాణలో పీడిత ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు ప్రియాంక గాంధీ. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలకు టాటా బాయ్ బాయ్ చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ ను భవిష్యత్ లో మ్యూజియంలో చూస్తారని అన్నారు.

Also Read:తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసిన ఈసీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HariHaraVeeraMallu Release: వీరమల్లు విడుదల డౌటే..? పవన్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ 'హరిహర వీరమల్లు' మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. మే 9న విడుదల కానుండగా.. ఇంకా షూటింగ్ పనులు పెండింగ్ ఉన్నట్లుగా సమాచారం. పవన్ ఆరోగ్యం, అలాగే కొడుకుకు ప్రమాదం జరగడం ఆలస్యానికి కారణమని టాక్.

New Update

HariHaraVeeraMallu Release:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన  'హరిహర వీరమల్లు' మళ్ళీ పోస్ట్ ఫోన్ కానున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ళ క్రితం మొదలుపెట్టిన ఈ సినిమాకు ఇంకా థియేటర్ మోక్షం కలగడం లేదు. మే 9న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించగా.. షూటింగ్ పనులు ఇంకా పెండింగ్ ఉండడంతో మళ్ళీ వాయిదా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వారం పవన్ కు సంబంధించిన షూట్ పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆయన కుమారుడు అగ్ని ప్రమాదానికి గురవడం, పవన్ ఆరోగ్యం కూడా బాగోలేకపోవడంతో  షెడ్యూల్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో అనుకున్న టైంకి మూవీని  రిలీజ్ చేయగలమా? లేదా అనే  టెన్షన్ లో ఉన్నారు మేకర్స్. మరోవైపు  ఫ్యాన్స్ కూడా  తీవ్ర నిరాశ చెందుతున్నారు.  ఇప్పుడు రిలీజ్ కాకపోతే..? ఇకపై  'హరిహరవీరమల్లు' విడుదల డౌటే? అని కామెంట్లు పెడుతున్నారు కొంతమంది. 

Also Read: HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

ఇప్పటికే మూడు సార్లు

ఇప్పటికే ఈ చిత్రాన్ని మూడు సార్లు పోస్ట్ ఫోన్ చేశారు.  మొదటగా 2021లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా.. కరోనా కారణంగా  2022 మార్చి 28కి పోస్ట్ ఫోన్ చేశారు. ఆ తర్వాత  2023, 2024లో పవన్ రాజకీయాలతో బిజీ అయిపోవడంతో 2025 మార్చి 28కి రిలీజ్ వాయిదా వేశారు. అయితే అప్పటికి కూడా ఈ సినిమా చూసే భాగ్యం దక్కలేదు  ఫ్యాన్స్ కి. మళ్ళీ మే 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు టాక్. 

మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై AM. రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని  క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, బాబీ డియోల్, ఎం. నాసర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిఇలా ఉంటే ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. 

cinema-news | latest-news | harihara-veeramallu-movie

Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment
Advertisment