Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. గర్భిణితో సహా శిశువు మృతి మెదక్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనోహరాబాద్ నుంచి దండుపల్లికి భార్యభర్తలు బైక్పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడునెలల గర్భిణీ అక్కడిక్కడే మృతి చెందారు. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. By B Aravind 31 Jul 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Medak District : మెదక్ జిల్లా మనోహరాబాద్లోని 44వ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడునెలల గర్భిణితో పాటు ఆమె కడుపులో ఉన్న శిశువు మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మిర్దొడ్డి మండలానికి చెందిన దంపతులు మనోహరాబాద్ నుంచి దండుపల్లికి బైక్పై వెళ్తున్నారు. నేషనల్ హైవే (National Highway) ను క్రాస్ చేస్తుండగా తుప్రాన్ వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ.. బైక్ను ఢీకొట్టింది. దీంతో దంపతులిద్దరూ కిందపడిపోయారు. మహిళతో పాటు ఆమె గర్భంలో ఉన్న ఏడు నెలల శిశువు అక్కడిక్కడే మృతి చెందారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మృతురాలి భర్తకు తీవ్రంగా గాయాలవ్వడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గర్భిణితో సహా శిశువు మృతి చెందడంతో మనోహరాబాద్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. Also Read: పూజా ఖేద్కర్కు బిగ్ షాక్.. అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్సీ #telugu-news #road-accident #medak సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి