Delhi Liquor Scam : 'అలాంటి వాళ్లని ఓడించండి'.. కేజ్రీవాల్‌ సందేశాన్ని వెల్లడించిన సతీమణి

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన తర్వాత జైలు నుంచి ప్రజలనుద్దేశించి పంపిన సందేశాన్ని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఈరోజు చదివి వినిపించారు. ఈ అరెస్టు తనను ఆశ్చర్యపరచలేదని.. దేశాన్ని బలహీనపరిచే శక్తులను ఓడించాలని ఆయన చెప్పినట్లు వివరించారు.

New Update
Delhi: నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు-సునీత కేజ్రీవాల్

Sunita Kejriwal : ఢిల్లీ(Delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Aravind Kejriwal) ను లిక్కర్‌ స్కామ్ కేసు(Liquor Scam Case) లో ఈడీ(ED) అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. శుక్రవారం రోజు ఆయనకు 6 రోజుల కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మరోవైపు కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై ఆప్‌ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన భార్య సునీతా కేజ్రీవాల్(Sunita Kejriwal) కూడా.. అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టుపై నిన్న స్పందించారు. అధికార దురాహంకారంతో ప్రధాని మోదీ.. కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని విమర్శలు చేశారు. కేజ్రీవాల్‌ జైల్లో ఉన్నా బయట ఉన్న ఆయన జీవితం దేశానికే అంకితమని చెప్పారు. అయితే తాజాగా ఈరోజు (శనివారం) మరో వీడియోను రిలీజ్‌ చేశారు. ఈ వీడియోలో.. అరవింద్‌ కేజ్రీవాల్‌ జైలు నుంచి పంపిన సందేశాన్ని సునీతా కేజ్రీవాల్‌ చదివి వినిపించారు.

Also Read : దక్షిణాదికి నీటి కొరత ముప్పు.. రిజర్వాయర్లలో తగ్గిపోతున్న నీటి మట్టాలు 

వాళ్లని ఓడించండి 

' నా ప్రియమైన దేశ ప్రజలారా నిన్న నేను అరెస్టు అయ్యాను. నేను లోపల ఉన్నా.. బయట ఉన్నా ప్రతిక్షణం దేశం కోసమే పనిచేస్తాను. ఈ అరెస్టు నన్ను ఆశ్చర్యపరచలేదు. బీజేపీ(BJP) పై నా అరెస్టు విషయంలో ఎలాంటి ద్వేషం చూపించకండి. వారు మన సోదరసోదరీమణులు. సమాజం కోసం మీ పని కొనసాగించండి. దేశాన్ని బలహీనపరిచేలా చేసే శక్తులు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిని గుర్తించి ఓడించండి. మీ సోదరుడు, కుమారుడైన నాపై ఢిల్లీ మహిళలు నమ్మకం ఉంచాలని కోరుతున్నాను. నన్ను ఎక్కువకాలం జైల్లో ఉంచే ప్రసక్తే లేదు. త్వరలోనే వచ్చి.. మీకిచ్చిన హామీలు నెరవేరుస్తాని' అరవింద్ కేజ్రీవాల్‌ సందేశాన్ని.. సునితా కేజ్రీవాల్‌ వివరించారు.

కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వస్తే 

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ జైల్లో నుంచే సీఎం బాధ్యతలు కొనసాగిస్తారని ఆప్‌ సర్కార్ ప్రకటించింది. ఒకవేళ.. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తే.. విద్యాశాఖ మంత్రి ఆతిశీ మార్లేనా, వైద్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌ పేర్లు బయటికి రావొచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వీళ్లతో పాటు కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్‌ కూడా ఈ రేసులో ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Also Read : నేడు ఈడీ ముందుకు కేజ్రీవాల్‌.. ఏం ప్రశ్నలు అడుగుతారంటే !

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Omar Abdullah: పాక్‌ ప్రధానిపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రధానిపై జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ విమర్శించారు. ఈ దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం దీనిపై తటస్థ, పారదర్శక దర్యాప్తునకు తాము రెడీగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. '' పహల్గాంలో చోటుచేసుకున్న దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదు.

Also read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఈ ఘటన వెనుక భారత్ ఉందని వాళ్లే మొదటగా ఆరోపించారు. మనపై ఎప్పుడూ ఆరోపణలు చేసేందుకు ముందుండే వాళ్లకు ఇప్పుడు మనమేమి చెప్పలేం. వాళ్లు చేసిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోవడం లేదు. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదని'' సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడాన్ని ఆయన ఖండించారు.  

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

ఇదిలాఉండగా.. పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ భారత్.. పాకిస్థాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పారు. '' భారత్‌ నుంచి కచ్చింతగా ప్రతీకార చర్య ఉంటుందని నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే భారత ప్రధాని మోదీ కూడా బిహార్‌లో చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. గతంలో పరిశీలిస్తే యూరీ, పుల్వామా దాడుల తర్వాత భారత్‌ చర్యలకు దిగిన సందర్భాలున్నాయి. యూరీ దాడి తర్వాత 89లో భారత్‌ చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత 12 రోజుల్లోనే సర్జికల్‌ స్ట్రేక్ చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్‌ దాడి చేసే అవకాశం ఉందని'' అబ్దుల్ బాసిత్ అన్నారు.

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

telugu-news | rtv-news | national-news | Omar Abdullah 

Advertisment
Advertisment
Advertisment