🔴Live News Updates: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
తము అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 9.20లక్షల కోట్ల విలువైన 78 భారీ పరిశ్రమలు.. 13,895 కోట్ల విలువైన 1,19,580 చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని మంత్రి లోకేష్ తెలిపారు. దీంతో యువతకు 8.5లక్షల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.
కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన కాళేశ్వరం కమిషన్.. 90 శాతం పంప్హౌస్లు నిర్మించిన మెఘా సంస్థ యజమానికి ఎందుకు ఇవ్వదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలినా ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదని ఫైర్ అయ్యారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొల్గొన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి అభిమానులు, నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి అందరికి శుభాకాంక్షలు తెలిపారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
పార్టీ అధిష్ఠానం నోటీసులు ఇవ్వబోతున్నట్లు వస్తున్న వార్తలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశాడు. తనను సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందనేది ప్రజల ముందుంచుతానని హెచ్చరించాడు.
వరుస ఎన్కౌంటర్లలో అగ్రనేతలను కోల్పోయిన మావోయిస్టు పార్టీ సేఫ్ జోనుకు తరలివెళ్తున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని నేషనల్పార్క్లోకి అడుగుపెట్టినట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. దీంతో అభయారణ్యంపై ఆపరేషన్ మొదలుపెట్టాయి.
నోటీసుల్లో పేర్కొన్న విధంగా ఈ నెల 5న తాను విచారణకు రాలేనని, 11న వస్తానని కాళేశ్వరం కమిషన్ కు కేసీఆర్ సమాచారం అందించారు. కేసీఆర్ వినతికి కమిషన్ సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న హరీష్ రావు విచారణ ఆధారంగా KCR తదుపరి నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.
మావోయిస్టులకు మరో దెబ్బ తగిలింది. ఛత్తీష్గఢ్ లో 16మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇద్దరు PLGA సభ్యులు సహా 14మంది నక్సల్స్ బస్తర్ ఎస్పీకిరణ్ చౌహాన్ ఇతర పోలీసు బలగాల ముందు తమ ఆయుధాలు అప్పగించి సరెండర్ అయ్యారు. వీరిపై రూ.25 లక్షల రివార్డు ఉంది.