Hyderabad: ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పిన యువతి.. తీరాచూస్తే షాక్

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో.. ఓ యువతి తన ఇంట్లో దొంగలు పడి రూ.25 వేలు ఎత్తుకెళ్లారని చెప్పింది. సమాచారం మేరకు పోలీసులు రావడంతో.. చివరికి ఆమె కట్టుకథ అల్లినట్లు తేలింది. ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడి డబ్బు పోవడంతో ఈ డ్రామా చేసిందనట్లు పోలీసులు గుర్తించారు.

New Update
Hyderabad: ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పిన యువతి.. తీరాచూస్తే షాక్

Hyderabad Rajendranagar Incident: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఎర్రబోడలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో దొంగలు పడ్డారని యువతి కేకలు వేసింది. చివరికి పోలీసుల విచారణలో ఆమె కట్టుకథ అల్లినట్లు తేలడంతో అందరూ షాకైపోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఆ యువతి ఒక్కసారిగా ఇంట్లో కేకలు వేసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ఏమైందని అడిగారు. దీంతో ఆ యువతి.. ఇద్దరు ముసుగు వేసుకున్న దొంగలు ఇంట్లోకి వచ్చి రూ.25 వేలు ఎత్తుకెళ్లారని చెప్పింది. వాళ్లని పట్టుకునేందుకు ప్రయత్నించగా నన్ను తోసేసి పారిపోయారని చెప్పింది.

Also Read: Elections: ఎన్నికల సిబ్బంది నిబంధనలు ఉల్లంఘిస్తే జరిగేది ఇదే..!

దీంతో సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అలాగే క్లూస్‌ టీమ్‌ను కూడా రంగంలోకి దింపారు. ఆ ఇంటికి సమీపంలో ఉన్న సీసీకెమెరాలను పరిశీలించారు. కానీ ఎక్కడా కూడా ఎవరూ అనుమానస్పదంగా వచ్చినట్లు, దొంగతనం జరిగినట్లు ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో ఆ యువతిని పోలీసులు గట్టిగా నిలదీశారు. చివరికి అసలు విషయం బయటపడింది. ఆమె చెప్పిందంతా.. కట్టుకథ అని తేలింది.

అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ఆమె ఆన్‌లైన్ గేమ్స్ ఆడి రూ.25 వేలు పోగొట్టుకుంది. స్నేహితుల నుంచి అప్పు తీసుకొని మరీ ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడింది. వాళ్లు డబ్బులు తిరిగెచ్చాయని అడగడంతో.. ఇంట్లో దొంగతనం జరిగినట్లు స్టోరీ అల్లింది. అందరిని నమ్మించేందుకు బీరువాలో ఉన్న దుస్తులు తానే చిందరవందరంగా పడేసింది. ఆ తర్వాత గట్టిగా కేకలు వేసి డ్రామాకు తెరలేపింది. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అసలు కథ బయటపడింది.

Also Read: రూ.లక్ష కోట్ల స్కామ్.. మహిళా వ్యాపారికి మరణశిక్ష..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment