Telangana News: ఆ మటన్ తింటే మటాషే.. పోలీసుల దాడుల్లో భయపెట్టే నిజాలు!

పరిగి పట్టణంలోని విద్యానగర్ కాలనీ లో మటన్ వ్యాపారి ఖలీల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. 15 రోజుల క్రితం కట్ చేసి నిల్వ ఉంచిన మటన్ గుర్తించడంతో అడ్డంగా దొరికిపోయాడు.60 నుంచి 70 కిలోల మటన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

New Update
Telangana News: ఆ మటన్ తింటే మటాషే.. పోలీసుల దాడుల్లో భయపెట్టే నిజాలు!

Telangana News: తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్, మటన్ షాపుల దగ్గర క్యూలైన్లు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా నగరవాసులు నాన్ వెజ్ తినేందుకు ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. అయితే తాజాగా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కొన్ని భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. వ్యాపారులు స్వలాభం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మేకపోతు అంటూ మేకల మాంసం, కోడి మాంసానికిరంగులు వేసి అమ్ముతూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.

వికారబాద్ జిల్లా పరిగి పట్టణంలోని విద్యానగర్ కాలనీ లో నివసిస్తున్న మటన్ వ్యాపారి ఎండీ ఖలీల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 15 రోజుల క్రితం కట్ చేసి నిల్వవుంచిన మటన్ ను గుర్తించడంతో అడ్డంగా దొరికిపోయాడు. రోజుల తరబడి నిల్వ ఉంచడమే కాదు..20రోజులకు సరిపడా మటన్ ఒకేసారి కట్ చేసి ఇంట్లో నిల్వ ఉంచుతున్నట్లు తెలిపాడు. మటన్ అమ్మే సమయంలో ఫ్రెష్ గా కనిపించేందుకు వెనిగర్ కలిపిన నీళ్లలో ముంచి కల్తీ చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. మటన్ వ్యాపారి ఇంట్లో దాదాపు 60 నుంచి 70 కిలోల మటన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేశారు. ఈ విషయం జిల్లాఎస్పీద్రుష్టికి తీసుకెళ్లారు.

ఇది కూడా చదవండి: వీటిని జాతీయ రహాదారులుగా గుర్తించండి.. గడ్కరికి కోమటి రెడ్డి వినతి..!!

జిల్లాలో ప్రజలు కల్తీ, నకిలీ ఆహారాలు పైన అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా నకిలీ, కల్తీ జరిగిన అసాంఘిక కార్యకలాపాలు జరిగిన తమ పరిధిలోని పోలీస్ అధికారులకు గాని జిల్లా టాస్క్ ఫోర్స్ SI ప్రశాంత్ వర్ధన్ సెల్ నంబర్ 8712583483కు సమాచారం అందించాలన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CLP meeting : కాంగ్రెస్ MLA ల జీతాలు కట్....పార్టీ కీలక నిర్ణయం

పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, ప్రతి ఎమ్మెల్యే తమ జీతం నుంచి నెలకి రూ.25 వేలు తప్పనిసరిగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి హుకూం జారీ చేసారు. పార్టీ ఆర్థిక అవసరాలు, ఇతర పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం వీటిని వినియోగించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

New Update
CLP meeting

CLP meeting

CLP meeting :  పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, ప్రతి ఎమ్మెల్యే తమ జీతం నుంచి నెలకి రూ.25,000 విరాళం తప్పనిసరిగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి హుకూం జారీ చేసారు. పార్టీ ఆర్థిక అవసరాలు, రాబోయే ఎన్నికల సన్నాహాలు, ఇతర పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం ఈ విరాళాలను వినియోగించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని నోవోటెల్‌ వేదికగా జరిగిన CLP మీటింగ్‌లో సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీకి ఆర్థికంగా అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హస్తం నేతలందరి లక్ష్యం ఒక్కటే అయ్యి ఉండాలని.. రెండోసారి ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.

Also Read :  ఎండకాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు.. సగటు కంటే 105% ఎక్కవ వర్షపాతం

ఇక నుంచి ఎమ్మెల్యేలంతా జనాల్లో ఉండాలని, విస్తృతంగా గ్రామాల్లో పర్యటించాలని రేవంత్‌ సూచించారు.పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడకూడదు. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తా అంటే కుదరదని హెచ్చరించారు.భయపడే పరిస్థితిలో పార్టీ లేదు. అద్దంకి దయాకర్‌లాగా అందరూ ఓపికతో ఉండాలి.అద్దంకి దయాకర్ ఓపికగా ఉన్నాడు కాబట్టే ఎమ్మెల్సీ అయ్యాడని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!

 మంత్రివర్గ విస్తరణ అంశం హైకమాండ్ చూసుకుంటుందని, మంత్రివర్గ విస్తరణ గురించి ఎవరూ బహిరంగంగా బయట మాట్లాడొద్దని సీఎం వార్నింగ్ ఇచ్చారు. సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చ జరిగింది. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలతోపాటు ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంపై నేతలకు వివరించారు సీఎం రేవంత్‌ రెడ్డి.

 

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

Advertisment
Advertisment
Advertisment