Alert : రేపు పెంట్రోల్ పంపులు బంద్..!!

దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు చాలా కాలంగా ఆకాశాన్నంటుతున్నప్పటికీ.. రాజస్థాన్‌లో మాత్రం సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని రాజస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ హెచ్చరించింది.

New Update
Alert : రేపు పెంట్రోల్ పంపులు బంద్..!!

Petrol Pump Strike: రాజస్థాన్‌లో ఇంధనంపై అధిక వ్యాట్‌కు నిరసనగా, రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ పంప్ ఆపరేటర్లు బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు పెట్రోల్ పంపులను మూసివేయనున్నారు. రాష్ట్రంలో ఇంధనంపై అధిక విలువ ఆధారిత పన్ను (వ్యాట్)కు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర సింగ్ భాటి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెట్రోల్‌ బంకులు మూసి ఉంటాయన్నారు.

ఇది కూడా చదవండి: ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాల ఎంపీలే టాప్…అసలు విషయం తెలుస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!!

రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై చర్యలు తీసుకోకపోతే సెప్టెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని భాటి హెచ్చరించారు. "అధిక వ్యాట్ పంప్ ఆపరేటర్లను మాత్రమే కాకుండా ప్రజలను కూడా ప్రభావితం చేసింది" అని ఆయన అన్నారు. వ్యాట్ తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే డిమాండ్ చేస్తున్నా పట్టించుకోలేదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు చాలా కాలంగా ఆకాశాన్నంటుతున్నప్పటికీ, రాజస్థాన్‌లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. రాష్ట్రంలోని శ్రీగంగానగర్ జిల్లాలో పెట్రోల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.112.74 కాగా, డీజిల్ ధర రూ.97.57గా ఉంది.

ఇది కూడా చదవండి: USB టైప్ C పోర్ట్‎తో ఐఫోన్ 15 సిరీజ్ రిలీజ్..ధర, ఫీచర్లు ఇవే..!!

అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలో పెట్రోలియం డీలర్ వ్యాట్ తగ్గింపు అంశం ఇప్పుడు ఊపందుకుంది. పెట్రోలు, డీజిల్‌పై విపరీతమైన వ్యాట్‌తో రాష్ట్ర ప్రజలు ద్రవ్యోల్బణ భారాన్ని అనుభవిస్తున్నారు. దీని కింద రాజస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సమ్మెకు వెళ్లాలని నిర్ణయించింది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్, పన్ను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సమావేశంలో ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. సమావేశంలో తహసీల్ స్థాయి వరకు ప్రతి జిల్లాలో రూట్ చార్ట్ తయారు చేసి సమ్మెను విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేశారు. ఈ విషయమై ఇప్పటికే రాజస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారం అందించింది.

ఇది కూడా చదవండి: లెమన్ వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు షాక్..!

ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అనుమతించింది. లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బిరిపోర్ట్ విభేదిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది.

New Update
MUDA Scam: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముడా స్కామ్ కేసు వేంటాడుతోంది. మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేసులో ఆయనకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముడా కేసులో విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతించింది. కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బి రిపోర్ట్ తో విభేదిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.

Also read: ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య అవినీతికి పాల్పడలేదని లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. ఈ కేసులో కొన్ని కీలక కోణాల్లో విచారణ జరగలేదని ఈడీ, స్నేహమయి కృష్ణ వాదించారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్‌ విచారణ చేపట్టారు. లోకాయుక్త పోలీసులు పూర్తి దర్యాప్తు నివేదిక సమర్పించిన తర్వాతే బి రిపోర్ట్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను మే 7న తేదీకి వాయిదా వేశారు. దీనికి ముందు, సిద్ధరామయ్య, మరో ముగ్గురిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మైసూరు డివిజన్ లోకాయుక్త పోలీసులు ప్రాథమిక నివేదకను సమర్పించారు. అయితే విచారణ కేవలం నలుగురు వ్యక్తులకే పరిమితం కాదని, ఇందులో ప్రమేయమున్న అందరికీ దర్యాప్తు జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

Advertisment
Advertisment
Advertisment