Nara Lokesh:ఏసీబీ కోర్టులో లోకేష్‌ పై సీఐడీ మోమో!

లోకేష్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సీఐడీ అధికారులు. యువగళం యాత్ర ముగింపు సమయంలో పలు ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.

New Update
Lokesh: నారా లోకేష్ ఫోన్ హ్యాక్!.. ఈసీకి ఫిర్యాదు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh) పై విజయవాడ ఏసీబీ కోర్టులో(ACB Court) సీఐడీ (CID) మెమో దాఖలు చేసింది. లోకేష్‌ సీఐడీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ప్రూఫ్స్‌తో సహా ఏసీబీ కోర్టుకు (ACB Court)  సమర్పించారు. యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా పలు మీడియా ఛానెళ్ల కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో లోకేష్‌ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు సీఐడీ ఆరోపణలు చేస్తుంది.

కేసు దర్యాప్తుని ప్రభావితం చేసేలా లోకేష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సీఐడీ ఆరోపించింది. చంద్రబాబు పై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు రిమాండ్‌ విధించడం తప్పని లోకేష్‌ ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి దురుద్దేశాలని ఆపాదించే విధంగా లోకేష్‌ వ్యాఖ్యాలున్నాయని సీఐడీ మెమోలో పేర్కొన్నారు.

స్కిల్, అమరావతి ఐఆర్‌ఆర్‌, ఫైబర్‌ నెట్‌ స్కామ్‌ కేసులలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని, తమ అభ్యంతరాలను పట్టించుకోలేదని టీడీపీ హయాంలో ఉన్న ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సీపీఆర్‌ కింద వాంగ్మూలం ఇచ్చారని గుర్తు చేశారు.

వాటిని లోకేష్‌ తప్పుపడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సీఐడీ పేర్కొంది. 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఎలా ఇస్తారని..రెడ్‌ బుక్‌ లో పేర్లు రికార్డు చేశానని..తమ ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తానంటూ లోకేష్‌ హెచ్చరించారని సీఐడీ పేర్కొంది. 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం నమోదు చేయడం న్యాయ విచారణ ప్రక్రియలో భాగం అంటున్నారు.

దీన్ని కూడా లోకేష్ తప్పుబట్టడ సరికాదంటున్నారు. సాక్షులని బెదిరించి కేసు దర్యాప్తుని పక్కదారి పట్డించాలని లోకేష్ ఉద్దేశంగా ఉందని సీఐడీ మెమోలో పేర్కొంది. గతంలో లోకేష్‌కి జారీ చేసిన 41ఏ నోటీసులలో పేర్కొన్న షరతులకి విరుద్దమంటోంది సీఐడీ.

Also read: పవన్‌ కి హరిరామజోగయ్య బహిరంగ లేఖ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: వైసీపీ నుంచి దువ్వాడ ఔట్.. జగన్ సంచలన ప్రకటన!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే ఈ చర్య తీసుకున్నారని చెప్పారు. 

author-image
By Manogna alamuru
New Update
MLC Duvvada : భార్యపై ఎమ్మెల్సీ దువ్వాడ కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ దువ్వాడపై మొత్తానికి వేటు పడింది. గత కొన్ని రోజలుగా వార్తల్లో నిలుస్తున్న దువ్వాడ శ్రీనివాస్ పై ఎట్టకేలకు వైసీపీ అధ్యక్షుడు జగన్ చర్యలు తీసుకున్నారు. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పినట్లు ఫిర్యాదులు రావడం వలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూ కొద్దిసేపటి క్రితం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 

జగన్ చెప్పిన మాట వినకపోవడం వల్లనే..

పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పిన మాట వినకపోవడం వల్లనే దువ్వాడను సస్పండ్ చేశారని తెలుస్తోంది. సుదీర్ఘ కాలం తర్వాత జగన్ ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. ఈ క్రమంలో టెక్కలి వైసీపీ ఇన్ ఛార్జి పేరాడ తిలక్ కి మద్దతు తెలపమని జగన్ అడిగారు. కానీ దీనికి దువ్వాడ ఒప్పుకోలేదు. దీంతో వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయమని పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశించారని చెబుతున్నారు. నాయకుడు చెప్పిన వెంటనే సస్పెన్షన్ ను అమలు చేసింది పార్టీ కేంద్ర కమిటీ.  దీంతో ఇప్పటి వరకు జగనే నా దేవుడు అన్న దువ్వాడ దారెటో అని పార్టీ జనాలు అనుకుంటున్నారు. ఇతని సస్పెన్షన్ తో టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. కుటుంబ కలహాలే దువ్వాడకు శాపంగా పరిణించాయని..ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలో వాణి హాస్తం వుందని మాట్లాడుకుంటున్నారు. 

 

ap
Mlc Duvvada suspention

 

 

 today-latest-news-in-telugu | duvvada-srinivas | ycp | suspend

Also Read: J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

 

Advertisment
Advertisment
Advertisment