Pawankalyan: అహంకారం తగ్గించుకుని ఆ భ్రమలోనుంచి బయటపడు.. జగన్పై పవన్ ఫైర్! వైఎస్ జగన్ ఇంకా ముఖ్యమంత్రి భ్రమలోనుంచి బయటపడట్లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా తత్వం బోధపడినట్లు లేదంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జగన్ కుట్రలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By srinivas 22 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి AP News: ప్రజలు అధికారం నుంచి దించేసినా జగన్ ఇంకా తానే సీఎం అనే భ్రమలో ఉన్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా తత్వం బోధపడినట్లు లేదంటూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోమవారం కూటమి శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడిన పవన్.. జగన్ నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెబుతూ కుట్రలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంకార ధోరణికి నిదర్శనం.. అలాగే సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ పెట్టుకోవడం, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం అతని అహంకార ధోరణికి నిదర్శనమంటూ విమర్శలు గుప్పించారు. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతామనే భ్రమ నుంచి ప్రజలు బయట పడేసినా ఇంకా తనే సీఎం అనుకుంటున్నారేమోనని సెటైర్స్ వేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా తాను, జనసేన పార్టీ వంద శాతం సహకరిస్తుందని చెప్పారు. ఇది కూడా చదవండి: SRI Chaitanya: ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ 2024.. శ్రీచైతన్య విద్యార్థికి బంగారు పతకం! #pawan-kalyan #ys-jagan #andrapradesh సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి