Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఎమోషనల్.. పోలింగ్ తర్వాత తొలిసారిగా స్పందించి.. ఏం అన్నారంటే..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలింగ్ తర్వాత తొలిసారిగా స్పందించారు. తనకు మద్దతుగా ప్రచారం చేసిన వర్మకు, నటులకు, పిఠాపురం ప్రజలకు, జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో ప్రేమ చూపించి ఆదరించారని..రికార్డ్ స్థాయిలో ఓటు వేసి మీ ప్రేమను తెలిపారని ప్రకటన విడుదల చేశారు.

New Update
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఎమోషనల్.. పోలింగ్ తర్వాత తొలిసారిగా స్పందించి.. ఏం అన్నారంటే..?

Pawan Kalyan First Response : జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పోలింగ్(Polling) తరువాత మొదటిసారి స్పందించారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపారు.  వర్మకు, తనకు మద్దతుగా ప్రచారం చేసిన నటులకు.. పిఠాపురం(Pithapuram) ప్రజలకు, జనసైనికులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. పోటీ చేస్తున్నానని ప్రకటన చేసిన మరుక్షణం నుంచి..ఎంతో ప్రేమ చూపించి ఆదరించారన్నారు. రికార్డ్ స్థాయిలో ఓటు వేసి మీ ప్రేమను తెలిపారని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ(TDP-BJP) నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Also Read: ఏపీ ఆందోళన పరిస్థితులపై ఈసీ సంచలన నిర్ణయం.. అప్పటి వరకు కేంద్రబలగాలు రాష్ట్రంలోనే..


మరువలేనిది..

ఈ సందర్భంగానే వర్మ(Varma) కు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పాద వల్లభని ఆశీస్సులు వర్మకు ఉండాలని..ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజా శ్రేయస్సుకు పనిచేయాలని ఆశీర్వదించారు. వర్మ సహకారం మరువలేనిదన్నారు. బలమైన టీడీపీ అభ్యర్థిగా ఉన్నా ఆయన సీటు త్యాగం చేసి తన కోసం నిరంతరం పనిచేసారన్నారు. భవిష్యత్తులో ఆయన చట్టసభల్లో అడుగు పెట్టి ప్రజాసమస్యల కోసం బలంగా పనిచేస్తారని పవన్ అన్నారు. వర్మ అనుభవాన్ని వినియోగించుకుంటూ.. కలిసికట్టుగా నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.


వమ్ము చేయకుండా..

సినీ కుటుంబ సభ్యుల ప్రేమను కదిలించే విధంగా తన కోసం పనిచేశారన్నారు. తనకు సహకారం అందించేందుకు, సిని నటులు, బుల్లితెర నటులు గడప గడపకు వేళ్ళి తన కోసం ప్రచారం చేసారని హర్షం వ్యక్తం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ఎన్నారైలు కూడా తన గెలుపు కోసం కృషి చేశారన్నారు. వాళ్ల అందరు చూపిన ప్రేమ తనను కదిలించిందన్నారు. అందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేస్తానని హామీ ఇచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Anna Lezhneva: పవన్ సతీమణి తలనీలాలు ఇవ్వడంపై వివాదం.. వైరల్ అవుతున్న వీడియోలు!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ భార్య అన్నా లెజినోవా తిరుపతిలో తలనీలాలు సమర్పించడం చర్చనీయాంశమైంది. మహిళలు తలనీలాలు సమర్పించవద్దని గరికపాటి గతంలో అన్న వీడియోను కొందరు షేర్ చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా పవన్ ఫ్యాన్స్ మరో ప్రవచనకర్త వీడియోను వైరల్ చేస్తున్నారు.

New Update
Anna Lezhneva

Anna Lezhneva

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ సింగపూర్‌ లో అగ్ని ప్రమాదంలో గాయాల పాలైన సంగతి తెలిసిందే.మార్క్‌ ఆ అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడి హైదరాబాద్‌కి చేరుకున్నాడు. ఈ క్రమంలో మార్క్‌ ని ఇంటికి తీసుకుని వచ్చిన తరువాత రోజే..పవన్‌ సతీమణి అన్నా లెజోనావా తిరుమలకు వెళ్లారు.

Also Read: VIRAL VIDEO: బెంగళూరులో సినిమా రేంజ్ లో రోడ్డు ప్రమాదం.. చూస్తే షాక్ అవుతారు!

publive-image

అక్కడ ఆమె డిక్లరేషన్‌ ఫామ్‌ పై సంతకాలు చేసి..స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. మరుసటి రోజు స్వామి వారిని దర్శించుకుని సేవలో పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా ఆమెనే అన్నప్రసాదాలను వడ్డించి,వారితోనే కలిసి కూర్చుని భోజనం చేశారు. అంతేకాకుండా మార్క్‌ పేరు మీద అన్న ప్రసాదాలకు విరాళాలు కూడా అందించారు.

Also Read: Ram Mandir: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

అన్నా భారతీయ స్త్రీ కాకపోయినప్పటికీ ఆమె స్వామి వారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించడం, సేవచేయడం వంటివి చేయడంతో జనసేన అభిమానులు,పవన్‌ అభిమానులు ఆవీడియోలను సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ చేస్తున్నారు. ఆమెకు భారతీయ సంస్కృతి మీద, దేవుని మీద ఉన్న భక్తిని కొనియాడుతున్నారు.

కానీ ఈ క్రమంలో తెరమీదకు మరో అంశం చర్చకు వచ్చింది.ఆమె తలానీలాలు సమర్పించడం కరెక్ట్‌ కాదు అంటూ కొందరు వాదిస్తున్నారు.

నిజమైన సనాతనంలో ఇది తగదంటున్నారు మరి కొందరు ఆధ్యాత్మిక వేత్తలు. ఈ క్రమంలో ప్రముఖ ఆధ్మాత్మిక గురువు, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు కి చెందిన ఓ వీడియోని వైరల్‌ చేస్తున్నారు. సనాతనం తెలిసిన హిందూ మహిళలు మూడు కత్తెరలు మాత్రమే ఇవ్వాలని చెబుతున్నారు. ముఖ్యంగా ముత్తయిదువులైన మహిళలు అస్సలు ఆ పని చేయకూడదంటున్నారు.

గుండు చేయించుకోవడం అశుభమంటున్నారు. మొక్కులు చెల్లించడం, జుట్టు ఇచ్చేయడం పరిపాటిగా మారిందని..దీనిని ఓవర్ యాక్షన్ అంటారంటున్నారు. పూర్వం ఎవరూ అలా చేయలేదని చెబుతున్నారు. భర్త ఉన్న స్త్రీ ఎప్పుడూ అలా చేయకూడదంటున్నారు. దీనికి లాజిక్ కావాలంటే సాధ్యం కాదని, కొన్ని యోగశాలలో రుజువైతే మరి కొన్ని యాగశాలలో నిరూపితమౌతాయని ఆ వీడియోలో ఉంది.

ఇదిలా ఉంటే...మరో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అయినటువంటి అనంతలక్ష్మి మాటల వీడియో పోస్ట్ చేస్తున్నారు. మహిళలు తల నీలాలు సమర్పించడంలో తప్పు లేదంటున్నారు అనంతలక్ష్మి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..

Also Read: USA-China: అమెరికా, చైనా టారిఫ్‌ వార్‌లో బిగ్‌ట్విస్ట్‌.. ఒప్పందానికి రానున్న ఇరుదేశాలు !

ap | tirumala | Anna Lezhneva In Tirupat | Anna Lezhneva Offering Hair at Tirumal | Pawan Kalyan Wife Anna Lezhneva | Pawan Kalyan Wife Anna Lezhnava offerd Hair | latest-news

Advertisment
Advertisment
Advertisment