Hamas-Israel War: ఇంకా కొనసాగుతున్న దాడులు.. గాజాలో 25 వేల మందికిపైగా మృతి

హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ గాజాపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 25 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందినట్లు గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. గత 24 గంటల్లోనే 178 చనిపోగా.. 300 మంది గాయాలపాలనైట్లు పేర్కొంది.

author-image
By B Aravind
New Update
Hamas-Israel War: ఇంకా కొనసాగుతున్న దాడులు.. గాజాలో 25 వేల మందికిపైగా మృతి

ఇజ్రాయెల్- హమాస్‌ మధ్య జరుగుతున్న దాడులు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. దాదపు మూడున్నర నెలలుగా ఈ యుద్ధం కొనసాగుతోంది. అయితే ఈ దాడుల్లో ఇప్పటివరకు 25 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 178 మంది మరణించగా.. 300 మంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించింది. మరోవైపు ఈ దాడుల్లో మృతి చెందినవారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది.

Also Read: మోదీ నాయకత్వం వల్లే రామమందిరం నిర్మించగలిగాం: న్యూజిలాండ్

అయితే అక్టోబర్ 7 నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా మొత్తం 25,105 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. అలాగే మరో 62,681 మంది క్షతగాత్రులయ్యారు. చాలా ప్రాంతాల్లో కూడా శిథిలమైన భవనాల కింద పడిపోయి చిక్కుకున్నారు. ప్రస్తతం వారు అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటూ గాజా ఆరోగ్య విభాగం అధికార ప్రతినిధి అష్రాఫ్ అల్-కిద్రా తెలిపారు. మరణించినవారిలో సాధారణ పౌరులు ఎంతమంది ఉన్నారు, అలాగే హమాస్ మిలిటెంట్లు ఎంతమంది ఉన్నారనే వివరాలు తెలియజేయలేదు.

అయితే దాదాపు 9వేల మంది హమాస్ మిలిటెంట్లు హతమయ్యారని ఇజ్రాయెల్ సైన్యం అంచనా వేస్తోంది. ఇదిలాఉండగా.. అక్టోబర్ 7న హమాస్‌ తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై మెరుపుదాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 1200 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ తర్వాత ఇజ్రాయెల్‌ సైన్యం హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా ప్రతిదాడులు ప్రారంభించింది. ఇప్పటికే 85 శాతం మంది గాజా ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో లక్షల మంది తలదాచుకుంటున్నారు.

Also Read: వైఎస్‌ఆర్ వాచ్ షర్మిల చేతికి .. కారణం ఇదేనా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!

చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు.

author-image
By Archana
New Update

Life Style: ఇదొక మెడికల్ మిరాకిల్ అనే పదం వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్ళీ బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు. సాధారణంగా గుండె ఆగిపోయినప్పుడు.. మెదడు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఇస్కీమియాకు దారితీస్తుంది. ఇస్కీమియా అనేది శరీరంలో కొంత భాగానికి రక్త ప్రవాహం తక్కువగా ఉండడం. సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇలాంటి పరిస్థితిల్లో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి శాశ్వతంగా మెదడు క్షీణించటం మొదలవుతుంది. అంతేకాదు  గుండెపోటు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

చైనా శాస్త్రవేత్తలు అద్భుతం 

ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చనిపోయిన పంది మెదడును బతికించిన ఫలితాలు .. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాలు చేసేలా ఉన్నాయి. అయితే పందులు చనిపోయిన తర్వాత నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించిన ఘటన 2019లోనూ జరిగింది. 

బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? 

మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది.

బ్రెయిన్ డెడ్ కారణాలు

  • మెదడుకు తీవ్రమైన గాయమైనప్పుడు
  • మెదడులో రక్తస్రావం జరగడం (ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్) 
  • ఇస్కీమిక్ స్ట్రోక్ ( సరైన ఆక్సిజన్ అందకపోవడం) 
  • గుండెపోటు
  • మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

Advertisment
Advertisment
Advertisment