Telangana News: 8 గంటల పాటు విద్యుత్ స్తంభంపైనే శవం.. అసలేం జరిగిందంటే?

జనగామ జిల్లా వనపర్తిలో విద్యుత్ అధికారుల సూచనతో స్తంభం ఎక్కి రిపేరు చేస్తున్న ఓ వ్యక్తి షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తేనే స్తంభం నుంచి శవం దించనిస్తామని గ్రామస్తులు 8 గంటల పాటు ఆందోళన చేపట్టారు.

New Update
Telangana News: 8 గంటల పాటు విద్యుత్ స్తంభంపైనే శవం.. అసలేం జరిగిందంటే?

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని వనపర్తి గ్రామంలో కుక్కల మల్లేష్(42) అనే వ్యక్తి కరెంట్‌ షాక్ కు గురై మృతి చెందారు. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లేష్ కరెంట్‌ వర్క్ చేసుకుంటూ విద్యుత్ అధికారులు చెప్పిన పనులు చేస్తూ ఉంటాడు. శుక్రవారం గ్రామంలోని ఓ ఇంట్లో విద్యుత్ సదుపాయాన్ని పునరుద్ధరించడం కోసం, అధికారులు ఎల్సీ ఇవ్వగా స్తంభం ఎక్కి రిపేర్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కరెంట్ రావడంతో షాక్ కు గురై మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మల్లేష్ ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

మల్లేష్ కుటుంబానికి రూ.10 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇస్తేనే మృతదేహాన్ని కిందికి దించనిస్తామని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్టేషన్ ఘనపూర్ ఏసీబీ బీమ్ శర్మ సంఘటన స్థలానికి చేరుకొని ఏడి అనిల్ కుమార్, ఏ శంకరయ్యతో మాట్లాడారు. కుటుంబ సభ్యుల డిమాండ్ గురించి పై అధికారులతో మాట్లాడాలని తెలిపారు. మృతుడి కుమారుడు చరణ్, కూతురు శృతిలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తానని, ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా వస్తుందని విద్యుత్ శాఖ అధికారి ఎస్సీ వేణుమాధవ్ హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు 8 గంటల తర్వాత ఆందోళన విరమించారు.

Also read: అంబానీ వివాహ వేడుకలో టాలీవుడ్‌ స్టార్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu Photograph: (Live News Updates in Telugu)

🔴Live News Updates:

Google LayOffs: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!

గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ వందలాది మందికి లేఆఫ్స్ ఇచ్చింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న వందల మంది ఉద్యోగులపై వేటు విధించినట్లు తెలుస్తోంది.

Google
Google Photograph: (Google )

 

ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతోంది. అనేక కంపెనీలు తమపై ఆర్థిక భారాన్ని దించుకోవడానికి ఒకేసారి వందలాది మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ.. వందలాది మందిపై వేటు వేసింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న వందల మందిని గురువారం ఒకేసారి ఉద్యోగాల్లోంచి తొలగించినట్లు సమాచారం. ఇప్పటి వరకు కరెక్టుగా ఎంత మందిపై లేఆఫ్స్ ప్రభావం పడిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. అయితే గూగుల్ ఇంత పెద్ద మొత్తం లేఆఫ్స్ ఎందుకు విధించిందో అనే విషయాలు గురించి తెలుసుకుందాం.

Also Read: Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

ఏప్రిల్ 10న గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ ఒకేసారి వందలాది మందికి లేఆఫ్స్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వార్త తాజాగా వెలుగులోకి రాగా.. కరెక్టుగా ఎంత మంది ఉద్యోగాలు పోయాయనే విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. అయితే ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులపై మాత్రం ఈ లే ఆఫ్‌ల ప్రభావం పడినట్లు తెలుస్తుంది. జనవరి లో గూగుల్ తన ఉద్యోగులకు ఆఫర్లు ప్రకటించి.. వెంటనే రెండు నెలలకే కోతలు విధించడంతో అంతా షాక్ అవుతున్నారు.

Also Read: Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి నుంచి దూకిన పిల్లలు, మహిళలు

ముఖ్యంగా 2024 డిసెంబర్ నెలలో కూడా గూగుల్ సంస్థ 10 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు  2023 జనవరి నెలలో మొత్తంగా 12 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. అయితే ఇందుకు కారణాలు చాలానే ఉన్నట్లు అనేక వార్తలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక అస్థిరత్వం వల్ల గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, అమెరికా ప్రతీకార సుంకాల యుద్ధం, మాంద్యం భయాలు, లాభాలు పూర్తిగా క్షీణించిపోవడం, ఏఐ వినియోగం విపరీతంగా పెరగడం వల్ల.. కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులపై వేటు విధిస్తున్నట్లు తెలుస్తుంది.

ఒక్క గూగుల్ సంస్థనే కాకుండా అనేక కంపెనీలు పలు కారణాలు చెబుతూ.. వేలాది మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నాయి. 2025వ సంవత్సరంలోనే సాంకేతిక రంగంలో 100 కంపెనీలు 27 వేల 762 మంది ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్స్.ఎఫ్‌వై వెబ్‌సైట్ వెల్లడించింది. 2024లో సుమారు 549 కంపెనీలు లక్షా 52 వేల 472 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. అలాగే అంతకు ముందు  2023లో వెయ్యి 193 కంపెనీలు.. 2 లక్షల 64 వేల 220 మంది ఉద్యోగాలకు కోత విధించినట్లు స్పష్టం చేసింది.

Also Read: Tahawwur Rana: తహవ్వుర్‌ రాణాపై కీలక అప్‌డేట్‌.. ఎక్కడ ఉంచారంటే..?

Also Read: Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో మితిమీరుతున్న ఆంక్షలు..మోడ్రన్ హెయిర్ కట్ చేసినా..

  • Apr 12, 2025 21:30 IST

    SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

    సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది.

    Punjab Kings batsman Shreyas Iyer scored 82 runs in the match against Sunrisers
    Punjab Kings batsman Shreyas Iyer scored 82 runs in the match against Sunrisers Photograph: (Punjab Kings batsman Shreyas Iyer scored 82 runs in the match against Sunrisers)

     



  • Apr 12, 2025 21:30 IST

    SRH VS PBKS: అన్నా ఏమి కొట్టుడే.. చెండాడేసిన శ్రేయస్.. ఎంత స్కోర్ చేశాడంటే?

    సన్‌రైజర్స్ హైదరబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో సన్‌రైజర్స్ బౌలర్లకు చెమటలు పెట్టించాడు. 36 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. సెంచరీకి కొద్ది దూరంలో ఔటయ్యాడు.

    Shreyas Iyer scored 82 runs



  • Apr 12, 2025 17:56 IST

    గులాబీల జెండా పట్టి మల్లేశో.. BRS సభ కోసం రసమయి అదిరిపోయే పాట.. మీరూ వినండి!

    బీఆర్‌ఎస్‌ పార్టీ సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతోంది. వరంగల్‌ జిల్లాలోని ఎల్కతుర్తి సమీపంలో ఈ నెల 27న పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని తలపెట్టింది. దీనికోసం రసమయి బాలకిషన్ అద్భుతమైన పాట రాసి పాడారు. ఇప్పుడు అ పాట  షోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

    BRS Silver Jubilee
    BRS Silver Jubilee

     



  • Apr 12, 2025 17:55 IST

    భారత్‌కు అనుకూలంగా మారనున్న అమెరికా-చైనా ట్రేడ్‌ వార్..!

    అమెరికా , చైనా మధ్య ట్రేడ్‌ వార్ కొనసాగుతూనే ఉంది. ఇది భారత్‌కు అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. చైనా తమ ఎగుమతులను అమెరికాకు కాకుండా ఎక్కువగా భారత్‌కు పంపించే ఛాన్స్ ఉంటుంది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

    America, China Trade War
    America, China Trade War

     



  • Apr 12, 2025 14:50 IST

    గుజరాత్‌కు మరో షాక్.. టోర్నీ నుంచి ఆల్‌రౌండర్ ఔట్!

    ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను గాయలబెడద వేధిస్తోంది. ఇప్పటికే కీలక పేసర్ కగిసో రబాడ జట్టుకు దూరమవగా తాజాగా మరో ఆల్ రౌండర్ గ్లెన్ ఫిలిప్స్‌ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. గజ్జల్లో గాయం కారణంగా ఈ టోర్నీ ఆడట్లేదని జీటీ టీమ్ అధికారిక పోస్ట్ పెట్టింది.

    gt ipl
    gt ipl Photograph: (gt ipl)

     



  • Apr 12, 2025 08:50 IST

    మరో ప్రాణం తీసిన పరువు హత్య.. వేరే కులస్థుడిని ప్రేమిస్తుందని తల్లి ఏం చేసిందంటే?

    గిరిజన యువకుడిని ప్రేమిస్తుందని తల్లి కూతురిని చంపిన దారుణ ఘటన తిరుపతిలో జరిగింది. మైనర్ బాలిక ఓ యువకుడితో గర్భం దాల్చగా.. తల్లి పోక్సో చట్టం కింద కేసు పెట్టి జైలుకి పంపించింది. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఇద్దరూ మళ్లీ కలవడంతో తల్లి కూతురిని చంపేసింది.

    suryapet crime
     crime

     

     



  • Apr 12, 2025 08:48 IST

    Ram Charan Campa AD: రామ్ చరణ్- 'కాంపా’ బ్రాండ్ సరికొత్త కోలా యాడ్ చూశారా..?

    రామ్ చరణ్ 'కాంపా'కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నారు. మిలీనియల్స్, జెన్ Zను లక్ష్యంగా చేసుకొని ఐపీఎల్ సమయంలో ‘కాంపా వాలి జిద్’ ప్రచార చిత్రం విడుదల కానుంది. ఇది కాంపా బ్రాండ్ విస్తరణలో కీలక అడుగు కావడం విశేషం.

    Ram Charan Campa AD
    Ram Charan Campa AD

     



  • Apr 12, 2025 06:39 IST

    Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో శనివారం కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేడు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేయనున్నాయి.

    AP Govt
    AP Govt

     



Advertisment
Advertisment
Advertisment