Ayodhya Ram Mandir : ఏడాదిలో ఒక రోజు రాముని తిలకంగా సూర్యుడు.. అయోధ్య రామమందిరంలో ప్రత్యేక ఏర్పాటు!

ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు సూర్యుడు అయోధ్య బాల రాముని నుదుట ముద్దాడనున్నాడు. సుమారు ఆరు నిమిషాల పాటు గర్భగుడిలోని విగ్రహం నుదుటన ప్రకాశించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.

New Update
Viral News: హనీమూన్‌ అని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లాడు..నాకు విడాకులు కావాలి!

Ayodhya Ram Mandir : ఎన్నో దశాబ్దాలుగా కలలు కన్న అయోధ్య రామ మందిరం(Ayodhya Ram Mandir)  ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఇంకా ఎంతో సమయంలేదు. మరికొన్ని గంటల్లో ఆ అద్భుత కార్యం ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను రామ మందిర అధికారులు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల ఉన్న రామ భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే రామ మందిర గురించి ఎన్నో విశేషాలు మన ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే అయోధ్య రామమందిరంలో మరో అద్భుత విశేషం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి(Sri Rama Navami)  నాడు సూర్యుడు బాల రాముని నుదుట ముద్దాడనున్నాడు. సుమారు ఆరు నిమిషాల పాటు గర్భగుడిలోని విగ్రహం నుదుటన ప్రకాశించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.

బాల రామునికి సూర్య తిలకంగా మారనున్నాడు. సూర్యుని సంచారం ఆధారంగా ప్రతి సంవత్సరం సూర్య తిలకం రామ నామంగా మారేటట్లు ప్రత్యేకమైన అద్దాలను రామ మందిరంలో అమర్చనున్నట్లు దీని కోసం ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌(Indian Institute Of Astrophysics) సాయం తీసుకున్నట్లు అధికారులు సమాచారం ఇచ్చారు.

రామ మందిరం మూడో అంతస్తు నుంచి సూర్య కిరణాలు నేరుగా గర్భ గుడిలోని విగ్రహం పై ఏడాదికి ఒకసారి అంటే శ్రీరామ నవమి నాడు మాత్రమే ప్రసరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు ఈ సూర్య తిలకం మొదలై ఆరు నిమిషాల పాటు బాల రాము(Bala Ram) ని విగ్రహం నుదుటన ప్రసరించనుంది.

రామ మందిరం మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని విగ్రహం పై సూర్య కిరణాలు ప్రసరించేలా కటకాలు, అద్దాలు, గేర్‌ బాక్స్లు గొట్టాలను ఏర్పాటు చేయనున్నారు. రామ మందిరం నిర్మాణంతో పాటు ఈ ప్రత్యేక వ్యవస్థలోనూ ఎలాంటి ఇనుము, విద్యుత్‌ వాడలేదని ఆలయాధికారులు తెలిపారు.

Also read: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి మరీ భర్త హత్య!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు. 

New Update
Renu Desai

Renu desai

తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు.  సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్. 

మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు రేణూ ఆరోపించారు. 

today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view

Also Read: WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

Advertisment
Advertisment
Advertisment