కళేబరాలతో కల్తీ నూనె... బయటపెట్టిన ఆర్టీవీ

మహబూబ్ నగర్ జిల్లా తాటికొండ గ్రామ శివార్లలో జంతు కళేబరాలతో నూనెను తయారు చేసే కంపెనీ బాగోతాన్ని RTV బయటపెట్టింది. ఈ కంపెనీ నుంచి వచ్చే దుర్వాసనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ కంపెనీపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారు.

New Update
కళేబరాలతో కల్తీ నూనె... బయటపెట్టిన ఆర్టీవీ

మహబూబ్ నగర్ జిల్లా తాటికొండ గ్రామ శివార్లలో దాదాపుగా 20 ఏళ్లుగా జంతు కళేబరాలతో నూనె తయారుచేసే కంపెనీ  నడిపిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. అక్రమ అదాయమే లక్ష్యంగా  జంతు కళేబరాలతో విషపూరిత మైన నూనె తయారు చేస్తున్నారు గ్రామస్తులంతా నిన్నటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.జాతీయ రహదారికి దాదాపు రెండు కిమీ దూరంలో ఉన్న ఈ కంపెనీకి ఓ వైపు గాజుల పేట గ్రామం, మరో రెండు వైపులా   తాటికొండ ,  ఇప్పలి పల్లి గ్రామాలున్నాయి, ఈ మూడు గ్రామాలకు కంపెనీ వల్ల వచ్చే దుర్వాసన కారణంగా శ్వాశ కొస వ్యాధులు , రకరకాల అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆందోళన చేస్తున్నారు.

నిజంగా లోపల ఏం జరుగుతోంది?

చుట్టూ నిర్మానుష్య వాతావరణం .. లోపల అంతా కుప్పలు కుప్పలుగా  జంతు కళేబరాలు , వీటి నుంచి వచ్చే విపరీతమైన దుర్వాసన కారణంగా శ్వాస కొశ  వ్యాధులు, మెదడు వ్యాపు వ్యాధులు వస్తున్నాయి. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. లోపల చూస్తుంటే ఓ పెద్ద సామ్రాజ్యమే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాత్రి వేళల్లో హైద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి జంతు కళేబరాలను తీసుకువచ్చి ఇక్కడ ఉన్న మెషినరీ తో ఆయిల్ గా మారుస్తున్నారు.హోటల్స్, మిగిలిన వ్యాపార కార్యకలాపాలకు ఈ నూనె ను చవక ధరకు విక్రయిస్తుంటారు. ఎన్నో సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సరే..వాళ్లకు ముట్టాల్సిన మామూళ్లు వాళ్లకు ఇస్తుండటంతో ఎవరూ ఈ కంపెనీ పై చర్యలు తీసుకోవడం లేదు. ఎప్పుడయినా ఆందోళన చేస్తే..హడావిడిగా అధికార్లు వచ్చి హై డ్రామా నడిపి ఓ రెండు నెలలు కంపెనీ సీజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసేస్తారు. ఎక్కడ చూసినా జంతు కళేబరాలు ..దుర్వాసన .  ఇప్పటికైనా కంపెనీ ఎత్తివేసి ..ఇక్కడ నుంచి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కళేబరాలను ముక్కలు ముక్కలుగా చేసి నూనె తయారు చేస్తారు.వాటి నుంచి వచ్చిన వ్యర్డాలతో డాల్డా, కోళ్ల దాణా,పశువుల దాణా తయారు చేస్తారు. ఈ విషయం పై RTV రిపోర్టర్ ఆ కంపనీ యాజమాన్యంతో మాట్లాడగా ఇక్కడ కేవలం పశువుల దాణా, కోళ్ల దాణా మాత్రమే తయారు చేస్తామని చెప్తున్నారు.
పేరు లేని కంపెనీ 
ఈ కంపెనీలో పని చేసేవర్కర్లు బయట రాష్ట్రాల వారుకావడంతో బయటివారు  ఎవరయినా లోపలకి వచ్చే ప్రయత్నం చేస్తే ఏం చేయడానికైనా వెనకాడరు.కనీశం నేఁ బోర్డు కూడా లేని ఈ కంపెనీ చట్ట విరుద్ద్దంగా నడుస్తోందని అర్ధమవుతోంది.  పండగ సమయం కావడంతో భారీగా జంతు కళేబరాలు లోడ్ వస్తుండగా  కొంతమంది యువకులు అడ్డుకుంటే .. ఆ యువకులను సైతం  కొట్టారని.. స్థానికులు ఆందోళన చేస్తున్నారు,. ఇప్పటికైనా అధికారులు ఈ కంపెనీ పై కఠిన చర్యలు తీస్కుని ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కాపాడాలని గ్రామస్తులు  డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ: చంద్రబాబు కేసు విచారణ… చివరిలో ఊహించని ట్విస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment