National: కనీస బ్యాలెన్స్ లేని ఖాతాల నుంచి రూ.8,500 కోట్లు –ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్

జనధన్‌తో పాటూ మరే ఇతర అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉండక్కర్లేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పేద ప్రజల ఖాతాల నుంచి జరిమానాలను వసూలు చేయలేదని రాజ్యసభలో జరిగిన చర్చలో ఆమె తెలిపారు.

New Update
BREAKING: 300 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్.. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం.. బడ్జెట్లో వరాల జల్లు

Nirmala Sitaraman: పేదవారి జన్‌ ధన్‌ ఖాతాలతో పాటు, ప్రాథమిక పొదుపు ఖాతాల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఉంచాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఐదేళ్ళల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఖాతాల నుంచి పెనాటీలను వసూలు చేయడం మీద రాజ్యసభలో చర్చ జరిగింది. దీని మీద నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. కనీస బ్యాలెన్స్ లేని ఖాతాల నుంచి 8,500 కోట్లు వసూలు చేశామని చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరం మొదలుకొని అయిదేళ్ల కాలంలో వినియోగదారుల నుంచి పీఎస్‌బీలు జరిమానాలు విధించాయి. ఇందులో ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే డిపాజిటర్ల నుంచి పీఎస్‌బీలు రూ.2,331 కోట్లు వసూలు చేశాయని చెప్పారు. అయితే వీటిలో పేద ప్రజల ఖాతాలు ఏమీ లేవని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు. పేద ప్రజల ప్రాథమిక ఖాతాలకు వసూళ్ళ నుంచి మినహాయింపు ఉందని చెప్పారు.

Also Read: Bangladesh: ప్రభుత్వాన్ని కూల్చేసిన 26ఏళ్ళ కుర్రాడు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ntr District కారు భీభత్సం .. ఏడుగురు అడ్డాకూలీలు పైకి దూసుకెళ్లింది..

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కారు భీభత్సం సృష్టించింది. చెరువు బజారు కట్ట వద్ద ఏడుగురు కూలీలు అందరు నిలబడి ఉండగా.. వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కారు యాక్సిడెంట్

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కారు యాక్సిడెంట్

Ntr District: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఏడుగురు అడ్డాకూలీలపైకి కారు దూసుకెళ్లిన దారుణ ఘటన చోటుచేసుకుంది. అయితే మేస్త్రీ పని చేయడానికి వచ్చిన  అడ్డాకూలీలు ఉదయం బజారు చెరువు కట్ట సర్కిల్ వద్ద నిలబడి ఉండగా.. అతి వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స నిమిత్తం  క్షతగాత్రులను వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి  తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. ప్రస్తుతం కారును సీజ్ చేయగా.. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఎమ్మెల్యే పరామర్శ.. 

ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే  శ్రీరాం రాజగోపాల్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని గాయపడిన వారిని పరామర్శించారు. సంఘటన గురించి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపవలసిందిగా డాక్టర్ కు సూచించారు.  గాయపడిన వారిలో ఓర్సు రామకృష్ణ, బత్తుల వెంకట గురువులు తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు తెలిపారు. 

telugu-news | latest-news | ntr-district

Advertisment
Advertisment
Advertisment