Murder: 9వ తరగతి బాలిక హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!

రాంబిల్లి తొమ్మిదొవ తరగతి బాలిక హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను జైలుపాలు చేసిందనే పాత కక్షతోనే ప్రమోన్మాది సురేష్‌ ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు.

New Update
Murder: 9వ తరగతి బాలిక హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!

Anakapalle Student: తొమ్మిదొవ తరగతి బాలిక హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు బటయకొస్తున్నాయి. ఏడాదిపాటు బాలికను వేధింపులకు గురిచేసిన దుర్మార్గుడు.. చివరికి అత్యంత దారుణంగా కడతేర్చడం వెనక పాత పగే కారణమని పోలీసులు నిర్దారించారు. ఈ మేరకు గతంలో అమ్మాయిని ప్రేమించాలంటూ వెంటపడి వేధించడంతో తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది బాలిక. దీంతో అతనిపై పోక్సో కేసుపెట్టి జైలుకు పంపించగా ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యాడు.

పాత కక్షతోనే దారుణం..
ఈ క్రమంలోనే రాంబిల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న కొప్పుగుండుపాలేనికి చెందిన బాలిక (14)పై కక్ష పెంచుకున్న నిందితుడు బోడాబత్తుల సురేష్‌(26) శనివారం ఆమె ఇంట్లోనే నరికి చంపాడు. అయితే రక్తపు మడుగులో ఉన్న మనవరాలిని చూసి గుండెలు బాదుకుంది నానమ్మ. చుట్టుపక్కలవారు అప్పటికే బాలిక మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బిడ్డ హత్యతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్‌ టీమ్‌లను రప్పించి నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఇక ఈ దారుణంపై హోం మంత్రి వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుణ్ని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణను ఆదేశించారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని, వీలైనంత త్వరగా పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Cabinet Meeting : ఎస్సీ వర్గీకరణకు ఓకే.. రూ.1403 కోట్లతో కొత్త అసెంబ్లీ, హైకోర్టు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

New Update
AP Cabinet Meeting

AP Cabinet Meeting

AP Cabinet Meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Also Read: VIRAL VIDEO: బెంగళూరులో సినిమా రేంజ్ లో రోడ్డు ప్రమాదం.. చూస్తే షాక్ అవుతారు!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్‌1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్‌ సెంటర్‌ ఫర్‌ క్లైమేట్‌ ఇన్‌ సిటీస్‌ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Also Read: Ram Mandir: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

విశాఖలోని ఐటీహిల్‌ -3 పైన టీసీఎస్‌కి 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఉరుస క్లస్టర్‌కు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయించింది. బలిమెల, జోలాపుట్‌ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్‌ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్‌ కన్సార్టియమ్‌కు కూడా రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్‌, సౌర విద్యుత్‌ ప్లాట్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Also Read:Bangladesh: నిప్పుతో గేమ్స్‌ వద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్

 

Advertisment
Advertisment
Advertisment