USA: తండ్రే కొడుకును చంపిన వైనం..ఆరేళ్ళ పిల్లాడితో జిమ్ చేయించిన తండ్రికి శిక్ష

కన్నతండ్రే కొడుకు చావుకు కారణం అయ్యాడు. శక్తికి మించిన ఎక్సర్సైజ్ చేయించండంతో అభం శుభం తెలియని ఆరేళ్ళ పిల్లాడు గుండె ఆగి చనిపోయాడు. ఇదంతా తండ్రే దగ్గరుండి చేయించడం శోచనీయం. ఈ కేసుకు సంబంధించిన విచారణ తాజాగా న్యూ జెర్సీ కోర్టు జరిగింది.

New Update
USA: తండ్రే కొడుకును చంపిన వైనం..ఆరేళ్ళ పిల్లాడితో జిమ్ చేయించిన తండ్రికి శిక్ష

తల్లిదండ్రులు...తమ పిల్లలను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. పరుగెడితే కింద పడిపోతారేమో..దెబ్బ తగిలితే ఏడుస్తారు అంటూ విలవిలలాడిపోతారు. కానీ ఇక్కడ ఓ తండ్రి మాత్రం కన్న కొడుకు పట్ల కసాయిగా ప్రవర్తించాడు. ఆరేళ్ళ పిల్లాడిని కూడా చూడకుండా అతనిపట్ల అన్యాయంగా ప్రవర్తించాడు. దీనివల్ల చివరకు పిల్లాడి ప్రాణాలే గాల్లో కలిసిపోయాయి. ఈ కేసుకు సంబంధించిన విచారణ తాజాగా అమెరికాలోని న్యూ జెర్సీ కోర్టులో జరిగింది. తండ్రి ఏం చేశాడో, పిల్లాడు ఎలా చనిపోయాడో...దానికి సంబంధించిన వీడియోను కోర్టులో ప్లే చేశారు.

అమెరికాలో 2021లో జరిగిందీ సంఘటన. న్యూ జెర్సీలోని అట్లాంటిక్ హైట్స్ క్లబ్ హౌస్ ఫిట్‌నెస్‌ సెంటర్‌లో తండ్రే పిల్లాడి ప్రాణాలు పోయేలా చేశాడు. క్రిష్టోఫర్ గ్రెగర్...ఇతనికి ఆరేళ్ళ కొడుకు ఉన్నాడు. పిల్లాడు కొంచెం లావుగా ఉన్నాడు. దాన్ని తగ్గించాలని అనుకున్నాడు గ్రెగర్. దాని కోసం జిమ్‌కు తీసుకెళ్ళి థ్రెడ్ మిల్ మీద పరుగెట్టించాడు. పిఇల్లాడు పరుగెత్తలేక పడిపోతున్నా..ఆగిపోతున్నా పట్టు వదల్లేదు. తానే స్వయంగా లేపి మరీ పరుగెట్టించాడు. అది కూడా వయసుకు మించిన వేగంతో థ్రెడ్ మిల్ చేయించాడు గ్రెగర్. దీంతో ఆ పసి గుండె తీవ్రంగా అలిసిపోయింది. గుండెపోటుకు గురైంది. దాంతోపాటూ కాలేయం కూడా దెబ్బ తింది. ఇవేవీ గ్రెగర్ గుర్తించలేదు. చివరకు పిల్లాడు అక్కడే జిమ్‌లోనే పరుగెడుతూ మరణించాడు.

నాలుగేళ్ళ క్రితం జరిగిన ఈ సంఘటన అక్కడి అందరి హృదయాలను కలిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో న్యూజెర్సీలోని సుపీరియల్ కోర్టులో ప్లే చేశారు. దీన్న ఇచూసి కోర్టులో జడ్జిలు సైతం కన్నీరు పెట్టుకున్నారు. ఇక పిల్లాడి తల్లి ఆవేదన అయితే చెప్పనలవి కాదు. ఈ వీడియో ద్వారా విపరీతమైన ఒత్తిడి కారణంగానే చిన్నారి చనిపోయినట్లుగా తేలింది. ఈ కేసులో పిల్లాడి మరణానికి కారణమైన తండ్రికి భారీగా శిక్ష పడే అవకాశం ఉంది.

Also Read:Andhra Pradesh: తూర్పు గోదావరి జిల్లాలో భారీ నగదు సీజ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

విషాదం.. సరదాగా పొలానికి వెళ్లిన చిన్నారి.. ఆ తర్వాత ఏమైందంటే?

కరీంనగర్‌లో సరదాగా అత్తమ్మ ఇంటికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అత్తమ్మ వాళ్లు పొలానికి వెళ్తుంటే వారితో సరదాగా వెళ్లి ట్రాక్టర్ తాళాన్ని ఒక్కసారిగా తిప్పింది. ట్రాక్టర్‌తో పాటు చిన్నారి బావిలోకి దూసుకెళ్లడంతో మృతి చెందింది.

New Update
suryapet crime

Crime

సరదాగా అత్తమ్మ ఇంటికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మూడేళ్ల చిన్నారి అత్తమ్మ ఇంటికి సరదాగా వెళ్లింది. అత్తమ్మ కుటుంబ సభ్యులు అందరూ కూడా పొలానికి వెళ్తుంటే వారితో సరదాగా వెళ్లింది. అక్కడ ట్రాక్టర్ ఎక్కిస్తే నవ్వుతూ కూర్చొంది.

ఇది కూడా చూడండి: USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

ఒక్కసారిగా తాళం తిప్పడంతో..

ఆమెను ట్రాక్టర్ ఎక్కించిన తర్వాత అత్తమ్మ కొడుకును ఎక్కించడానికి పక్కకి వెళ్లారు. ఇంతలో ఆ మూడేళ్ల పాప ట్రాక్టర్ తాళాన్ని ఒక్కసారిగా తిప్పింది. దీంతో ఆ చిన్నారితో పాటు ట్రాక్టర్ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

ఇది కూడా చూడండి: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

ఇదిలా ఉండగా ఈమధ్య కాలంలో పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తలను చంపుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ప్రియుడితో కలిసి  కట్టుకున్న భర్తను భార్య కిరాతకంగా చంపిన ఘటన మరువకముందే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది.

ఇది కూడా చూడండి: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం రాయ్‌బరేలీలో స్థానికంగా ఉండే ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇందుకోసం వారు ఓ తుపాకీని కూడా అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ఓ పొలంలో పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.  అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భార్య, ఆమె ప్రియుడు నిందితులని తెలుసుకుని అరెస్టు చేశారు. ఈ కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు.  

Advertisment
Advertisment
Advertisment