AP: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. ఆపరేషన్ వికటించి బాలింత మృతి! నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఏమల శ్రావణి అనే బాలింత మరణించింది. మృతదేహంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. By srinivas 24 May 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో ఏమల శ్రావణి (21) అనే బాలింత మరణించింది. కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన శ్రావణి పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు నెల్లూరుకు తరలించారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గూడూరు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందంటూ శ్రావణి భర్త ఏమల హరి ఆందోళన వ్యక్తం చేశారు. బాలింత మృతదేహంతో బంధువులు, కుటుంబ సభ్యులు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. Your browser does not support the video tag. #nellore #pregnent-women-died #govt-hospital సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి