Mumbai: వరల్డ్కప్ విన్నర్స్కు అంబానీల ఘన సన్మానం విశ్వవిజేతలకు ముఖేష్ అంబానీ కుటుంబం ఘన సన్మానం చేసింది. పెళ్ళి ఇంట్లో వారి కోసం ఒక ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసి సత్కరించింది. ముంబై ఇండియన్స్ టీమ్ ఆటగాళ్ళు అయిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాల గురించి చెబుతూ నీతా అంబానీ ఆనందంతో కన్నీరు కూడా పెట్టుకున్నారు. By Manogna alamuru 08 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి amabani special celebrations: ప్రస్తుతం అంబానీ ఇల్లు సందడులతో నిండిపోయింది. మరో ఐదు రోజుల్లో అనంత్, రాధికాల పెళ్ళి జరగనుంది. దీనికి సంబంధించి జూన్ 29 నుంచి రోజూ ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూనే ఉంది. సంగీత్ అని, మెహందీ, పూజ ఇలా...రీసెంట్గా జరిగిన సంగీత్లో అంబానీ కుటుంబంతో పాటూ జస్టిన్ బీబర్, బాలీవుడ్ అంతా సందడి చేశారు. ఇంత హాడావుడిలో తమ టీమ్ ఆటగాళ్ళను మర్చిపోలేదు ముంబై ఇండియన్స్ ఓనర్లు అయిన నీతా అంబానీ, ముఖేష్ అంబానీలు. వరల్డ్కప్ గెలిచి ఇంటికి వచ్చిన విశ్వ విజేతల కోసం ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు. క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా ఓ అభినందన సభను ఏర్పాటు చేశారు నీతా అంబానీ. దాని కంటే ముందు మంబై ఇండియన్స్ ఆటగాళ్ళు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్లతో ప్రత్యేక పూజ చేయంచడమే కాకుండా వారికి పండితుల చేత ఆశీర్వాదం ఏర్పాటు చేయించారు. దీని తరువాత స్టేజ్ మీదకు నీతా అంబానీ ఒక్కొక్కరినే పిలుస్తూ...వారిని స్పెషల్ గా అభినందించారు. వారి గురించి చెబుతూ ఆనందంతో కన్నీరు కూడా పెట్టుకున్నారు. అంతా అయ్యాక ఆ ప్రోగ్రామ్కు వచ్చిన వారందరూ కలిసి క్రికెటర్లకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. భారత జెండాలను ఊపుతూ , చప్పట్లు కొడుతూ వారిని చీర్ అప్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమానికి హాజరయిన రోహిత్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యాలు నల్ల రంగు డిజైనర్ కుర్తాల్లో మెరిసారు. రోహిత్, స్కైలు తమ భార్యలను కూడా తీసకువచ్చారు. Your browser does not support the video tag. Also Read:Tirupathi: తిరుపతిలో భారీ వర్షం..ఇబ్బందులు పడుతున్న భక్తులు #cricketers #nitha-ambani #mumbai-indians #puja సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి