Kota : కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. 48 గంటల్లో రెండోది!

దేశంలో పోటీ పరీక్షలకు కేంద్రంగా మారిన కోటా ..ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారింది. కేవలం 48 గంటల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. సారీ నాన్న అంటూ మంగళవారం ఓ విద్యార్థి ఉరేసుకుని మరణించాడు.

New Update
Telangana : అయ్యె.. తల్లికి అంత్యక్రియలు చేయకుండా.. అనాథగా వదిలేసి..

Student Suicide : దేశంలో పోటీ పరీక్షలకు(Competition Exams) కేంద్రంగా మారిన కోటా(Kota).. ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యల(Suicide) కు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారింది. కేవలం 48 గంటల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. సారీ నాన్న అంటూ మంగళవారం ఓ విద్యార్థి ఉరేసుకుని మరణించాడు.
మృతి చెందిన విద్యార్థిని పోలీసులు భరత్‌ కుమార్ రాజ్‌పుత్‌గా గుర్తించారు.

భరత్‌ కుమార్ రాజ్‌పుత్ గత కొంతకాలంగా నీట్ పరీక్ష(NEET Exam) కోసం సిద్దమవుతున్నాడు. ఇప్పటికే రెండు సార్లు నీట్‌ పరీక్షకు హాజరయ్యాడు. తన బంధువు రోహిత్‌తో కలిసి హాస్టల్ గదిలో ఉంటున్నాడు. కాగా, మే 5న మరోసారి అతడు పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం 10.30 సమయంలో రోహిత్ ఏదో పనిమీద బయటకు వెళ్లగా భరత్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో గంట తరువాత తిరిగొచ్చిన రోహిత్‌కు తన గదికి లోపలి నుంచి గడియపెట్టి ఉండటం గమనించాడు. కిటిలోకి తొంగి చూడగా భరత్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు.

విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు భరత్ ఓ ఆత్మహత్య లేఖను కూడా రాసినట్టు పోలీసులు తెలిపారు. ‘‘సారీ నాన్నా, ఈ సంవత్సరం నేను సక్సెస్ కాలేకపోయాను’’ అని భరత్ లేఖలో పేర్కొన్నాడు. పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో భరత్ తీవ్ర ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read: నేడే మేడే.. ఈ కార్మికుల దినోత్సవ చరిత్ర ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment