Amit Shah : ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా సంచలన ట్వీట్

ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు.  2026 మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని శపథం చేసిన అమిత్ షా తాజా ఎన్‌కౌంటర్‌ను "నక్సలిజానికి మరో బలమైన దెబ్బ" అని అభివర్ణించారు.

New Update
shah amit

shah amit Photograph: (shah amit)

ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు.  2026 మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని శపథం చేసిన అమిత్ షా తాజా ఎన్‌కౌంటర్‌ను "నక్సలిజానికి మరో బలమైన దెబ్బ" అని అభివర్ణించారు.  నక్సల్ రహిత భారత్‌ను నిర్మించడంలో తమ భద్రతా బలగాలు పెద్ద విజయాన్ని సాధించాయని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న భద్రతా సిబ్బందికి అమిత్‌ షా ప్రసంశలు కురిపించారు.  మన భద్రతాదళాలు సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు.  నక్సల్స్‌ లేని భారత్‌ దిశగా ఇది కీలక అడుగు అని పేర్కొన్నారు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు.  దేశంలో నక్సలిజం చివరి దశకు చేరిందని అమిత్ షా అభిప్రాయపడ్దారు.

ఒడిశాలోని నువాపాడా జిల్లాకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని కులారిఘాట్ రిజర్వ్ ఫారెస్ట్‌లో భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారని ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా జనవరి 19 రాత్రి ఆపరేషన్ ప్రారంభించింది.  భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగగా.. ఈ కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.  మరణించిన ఇద్దరు మహిళలు సోనాబెడా-ధరంబంధ కమిటీకి చెందినవారని తేలింది.  కోటి రూపాయల రివార్డుతో నక్సల్ టాప్ కమాండర్ జయరామ్ అలియాస్ చలపతి కూడా హతమయ్యాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఎన్‌కౌంటర్ తర్వాత భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒడిశా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నక్సల్స్ వైపు నుంచి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ మాట్లాడుతూ, 2024లోనే రాష్ట్రంలో కనీసం 220 మంది నక్సలిటీలు మరణించారని, గత ఐదేళ్లలో 219 మంది నక్సలైట్లు మరణించారని చెప్పారు.  తాజా  ఎన్‌కౌంటర్‌లతో కలిపి ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది మావోయిస్టుల మరణాల సంఖ్య 28కి చేరగా, గతేడాది వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 219 మంది మావోయిస్టులు మరణించారు.  అంతేకాకుండా, 2024లో రాష్ట్రంలో 992 మంది వామపక్ష తీవ్రవాదులను అరెస్టు చేయగా, 837 మంది లొంగిపోయారు.

Also Read :  హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్న సైఫ్ అలీఖాన్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

హర్యానాలోని జిందాల్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటన గురించి తెలిసిందే. తాజాగా దీనిపై వర్సిటీ యాజమాన్యం స్పందించింది. విద్యార్థినులు సరదాగా ప్రాంక్ చేశారని స్పష్టం చేసింది.

New Update
Jindal university responds after girl caught sneaking into boys' hostel in suitcase

Jindal university responds after girl caught sneaking into boys' hostel in suitcase

హర్యానాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటన గురించి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై యూనివర్సిటీ అధికారులు స్పందించారు. అమ్మాయిని బాయ్స్‌ హాస్టల్‌కు తీసుకొచ్చారని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. యూనివర్సిటీ హాస్టల్‌లో కొందరు విద్యార్థినులు సరదాగా ప్రాంక్ చేసినట్లు చెప్పారు. 

Also Read: మూడే మూడు పెగ్గులు.. సైకిల్‌తో రోడ్‌రోలర్‌ను ఈడ్చుకుంటూ- రయ్ రయ్

దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణ చేశారని.. కొందరు విద్యార్థినులు సరదాగా ఈ పని చేసినట్లు తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. తోటి స్నేహితులు ఒక అమ్మాయిని సూట్‌కేసులో కూర్చోబెట్టి క్యాంపస్‌లో గ్రౌండ్‌కి, మేడ మీదకి తీసుకెళ్లారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది వాళ్లని గమనించి ఆపారు. సూట్‌కేస్ తెరవగా అందులో నుంచి అమ్మాయి వచ్చింది. ఈ వీడియో బయటకు వెళ్లడంతో దీన్ని తప్పుగా చిత్రీకరించారు. ఇలా చేసిన విద్యార్థులకు వర్సిటీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేసిందని'' తెలిపారు.

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ఇదిలాఉండగా.. జిందాల్ వర్సిటీకి చెందిన ఓ విద్యార్థి సూట్‌కేసులో ఓ అమ్మాయిని కూర్చోబెట్టి బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. అక్కడున్న సిబ్బంది ఆ సూట్‌కేస్ తెరవగా అందులో నుంచి అమ్మాయి బయటికి వచ్చింది. సోషల్ మీడియాలో దీనిపై నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేశారు. దీంతో తాజాగా దీనిపై స్పందించిన వర్సిటీ యాజమాన్యం ఇదంతా ప్రాంక్ అని స్పష్టం చేసింది. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

 telugu-news | rtv-news | haryana | national-news 

 

 

Advertisment
Advertisment
Advertisment