/rtv/media/media_files/2025/02/16/2bsybuSfkhBbC7naG4Bn.jpg)
Blast A In Nagpur
మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. నాగపూర్ కు సుమారు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎస్బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఈ మధ్యాహ్నం పేలుడు సంభవించింది.
పేలుడు పదార్థాలను తయారు చేసే ఈ కంపెనీలో పేలుడు సంభవించడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు ఘటనతో సమీపంలోని పొదలకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మృతులతో పాటు గాయపడిన వారిని సమీప దవాఖానలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.