Karnataka: దారుణం...చెట్టుకు క‌ట్టేసి ప్రైవేట్ పార్ట్స్‌లో ఎర్ర చీమ‌ల‌ను వ‌దిలి ...

కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో అమానుష ఘ‌ట‌న చోటుచేసుకుంది. దొంగ‌త‌నం నెపంతో ఓ బాలుడిని అతని సొంత‌ వర్గానికి చెందినవారే దారుణంగా హింసించారు. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట‌ వైరల్‌గా మారింది.

New Update
 Karnataka

Karnataka

Karnataka : ఇద్దరు మైనర్‌ బాలలను చెట్టుకు కట్టేసి తీవ్రంగా హింసించిన ఘటన.. కర్నాటకలోని దావణగెరి కలకలం రేపుతోంది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. నల్లూరు సమీపంలోని అస్తపనహళ్లిలో ఈ సంఘటన జరిగింది. హకీపిక్కీ వర్గానికి చెందిన బాలలపై.. అదే వర్గానికి చెందిన యువకులు దాడి చేశారు. వీరంతా మూలికలు అమ్ముతూ జీవనోపాధి పొందుతుంటారు. అయితే దొంగతనం చేశారన్న ఆరోపణలతో ఇద్దరు బాలలను కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆపై ఎర్ర చీమలను వారి ప్రైవేటు పార్ట్స్ లో వదిలారు.నొప్పి తాళలేక వాళ్లు కేకలు పెడుతుంటే.. అవి వింటూ నిందితులు డ్యాన్స్‌లు చేశారు. ఆనందంతో విర్రవీగుతూ వారిపై కర్కశంగా దాడి చేస్తూ.. పైశాచికానందం పొందారు. 

Also Read :  Fake Hair Growth : ఘరానా మోసగాడు.. బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ గుండ్లు కొట్టి పరార్!

ఒక బాలుడు దర్శన్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం చేసి పారిపోయాడు. ఈ దొంగతనం చేయటంలో మరో బాలుడు సాయం చేశాడు. సాయంత్రానికి దొంగతనం చేసిన బాలుడు దొరికేశాడు. ఆ తర్వాత సాయం చేసిన బాలుడు కూడా దొరికాడు. నిందితులు ఇద్దర్నీ కూడా అక్కడి అడవుల్లోకి తీసుకెళ్లారు. చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. వారి చడ్డీలలోకి ఎర్ర చీమల్ని వదిలి హింసించారు. దాన్నంతా వీడియో తీశారు. బాగా చిత్ర హింసలు పెట్టిన తర్వాత వదిలేశారు. 3 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దెబ్బలు తిన్న ఓ బాలుడి తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలలను తీవ్రంగా హింసించిన ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా ఘటనను తీవ్రంగా ఖండించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Raghunandan: మీనాక్షి నటరాజన్, రేవంత్ కు మధ్య వార్.. ఎంపీ రఘునందన్ సంచలన ఇంటర్వ్యూ!

మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చన్నగిరి పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎం. రవీష్ తెలిపారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. బాధితులలో ఒకరి తాత ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని తెలిపారు. మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుభాష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. లక్కీ, దర్శన్, పరసు, శివదర్శన్, హరీష్, పట్టి రాజు, భూని, సుధాన్‌ల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. బాధితుడితో పాటు నిందితులు కూడా హక్కిపిక్కి జాతికి చెందిన వారే. వారంతా అడవిలోని మూలికలు అమ్మి జీవిస్తుంటారు. అరెస్టు చేసిన వారందరినీ ఆదివారం జె.ఎం.ఎఫ్.సి కోర్టు ముందు హాజరుపరిచి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని రవీష్ అన్నారు.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీగా అద్దంకి ప్రమాణ స్వీకారం.. ఆత్మీయంగా అలింగనం చేసుకున్న కోమటిరెడ్డి.. ఫొటోలు వైరల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indian Idol : ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేత పవన్‎దీప్ రాజన్ కు ఘోరప్రమాదం...పరిస్థితి విషమం

స్టార్ సింగర్, ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేత పవన్‎దీప్ రాజన్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ రోజు తెల్లవారుజామున అహ్మదాబాద్‌లో పవన్ దీప్ ప్రయాణిస్తోన్నకారు ముందున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవన్ దీప్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.

New Update
Indian Idol Season 12 winner

Indian Idol Season 12 winner

Indian Idol  : స్టార్ సింగర్, ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేత పవన్‎దీప్ రాజన్ ప్రమాదానికి గురయ్యాడు. సోమవారం (మే 5) తెల్లవారుజామున అహ్మదాబాద్‌లో పవన్ దీప్ ప్రయాణిస్తోన్న కారు ముందున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఉత్తరాఖండ్ కు చెందిన ఈ పవన్ దీప్ రాజన్.. ఈ రోజు తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో తన కారులో నేషనల్ హైవే-9పై ప్రయాణించాడు. ఆ టైమ్ లో తన ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో కారు నుజ్జయిపోయింది. ఇందులో ఉన్న పవన్ దీప్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.

ఇది కూడా చదవండి: Warangal Fire Accident: వరంగల్‌‌లో భారీ అగ్ని ప్రమాదం..30 ఎకరాల్లో పంట దగ్ధం


 గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నోయిడాకు తరలించారు. నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్లో ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పవన్ దీప్ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. ఇందులో అతడి కాళ్లు, చేతులు, ముఖానికి తీవ్ర గాయాలు అయినట్లు అర్ధమవుతోంది. ఇది చూసి.. పవన్ దీప్ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం పవన్‎దీప్ హెల్త్ కండిషన్ విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ అడ్డంగా దొరికేశాడు.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియో వైరల్!

అయితే.. అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. చిన్నతనం నుంచే సంగీతంలో రాణిస్తోన్న పవన్ దీప్.. ప్రతిష్టాత్మక ఇండియన్ ఐడల్ 12ను గెలుచుకున్నాడు. దీంతో పవన్‎దీప్ రాజన్ పేరు మోరుమోగిపోయింది.  ఏప్రిల్ 27వ తేదీన పవన్ తన బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఇంతలోనే ఘోర ప్రమాదానికి గురికావడంతో పవన్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. 

ఇది కూడా చదవండి: Khammam Digital Arrest: ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు