Supreme Court : వక్షోజాలు తాకితే అత్యాచారం కాదన్న జడ్జి.. సుప్రీంకోర్టు సీరియస్..కీలక ఆదేశాలు!

ఇటీవల ఓ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదంగా మారింది. దీంతో సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. హైకోర్టు జడ్జి తీర్పుపట్ల అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. జడ్జి కామెంట్లు అమానవీయంగా ఉన్నాయంటూ అభిప్రాయపడింది.

New Update
Allahabad HC order

Allahabad HC order

స్త్రీల వక్షోజాలను తాకడం, వారు వేసుకున్న పైజామా దారం విప్పడం వంటివి అత్యాచారం కిందికి రాదంటూ ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదంగా మారింది.  ఈ క్రమంలో సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి బుధవారం రోజు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో హైకోర్టు జడ్జి తీర్పుపట్ల అత్యున్నత న్యాయస్థానం ఫైర్ అయింది.  జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ ధర్మాసనం ఈ కామెంట్లు ఏమాత్రం సున్నితమైనవి లేవని..  అమానవీయంగా ఉన్నాయంటూ అభిప్రాయపడింది. ఈ వివాదాస్పద ఉత్తర్వుపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. అంతేకాకుండా  ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌ కసగంజ్‌లో  2021 నవంబరులో ఓ మహిళ తన 11ఏళ్ల కుతురితో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగివస్తోంది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బాలికను ఇంటి దగ్గర దింపుతామని నమ్మించి బైక్‌పై ఎక్కించుని మార్గమధ్యంలో లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలికను అసభ్యంగా తాకుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. బాలిక అరుపులు విని స్థానికులు స్పందించగా నిందితులు పారిపోయారు. బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ కేసు అలహాబాద్‌ హైకోర్టుకు చేరగా గురువారం విచారణ జరిగింది. 

ఈ కేసును మొదట విచారించిన అలహాబాద్ ట్రయల్ కోర్టు.. పోక్సో చట్టంలోని సెక్షన్ 376, సెక్షన్ 18 (అత్యాచారం, నేరం చేయడానికి ప్రయత్నించడం) ప్రకారం నిందితులకు సమాన్లు పంపింది.  దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కేసుపై విచారణ జరిపిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. 'మైనర్ బాలికల వక్షోజాలను పట్టుకోవడం,  పైజామా దారం తెంపివేయడం, పారిపోయే ముందు ప్యాంట్ కిందికి లాగడం అత్యాచారయత్నంగా పరిగణించబడవు. ఇది పోక్సో చట్టంలోని సెక్షన్ 376, సెక్షన్ 15 నేరాల కిందికి రాదు. కానీ పోక్సో సెక్షన్ 9/10, సెక్షన్ 354-B ( లైంగిక వేధింపులు, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) ప్రకారం సమన్లు జారీ చేయొచ్చు అని స్పష్టం చేశారు.  దీంతో ఇది వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణాదేవి మండిపడ్దారు.  న్యాయమూర్తి వ్యాఖ్యలు న్యాయస్థానాలపై గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలన్నారు.  

Also Read :  కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు .. భట్టి వార్నింగ్!

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు

ఈ మధ్య తరుచుగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. ఈరోజు మళ్ళీ దేశ వ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి. గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప్స్ పనిచేయకపోవడంతో   కస్టమర్లు ఇబ్బందిపడ్డారు. 

New Update
hdfc

UPI

ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏ యూపీఐ సేవా పని చేయలేదు. అసలు ఏ ట్రాన్సాక్షన్స్ పని చేయలేదు. రీసెంట్ గా మార్చి 26న యూపీఐ ట్రాన్సక్షన్స్ లో ఇదే సమస్య రాగా మళ్లీ ఇవాళ అదే సమస్య రావడంతో కస్టమర్లు మండిపడుతున్నారు. స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప్స్ పనిచేయకపోవడంతో   కస్టమర్లు ఇబ్బందిపడ్డారు. ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం ఏప్రిల్ 2న  రాత్రి 8 గంటల వరకూ యూపీఐ పని చేయడం లేదని 449 ఫిర్యాదులు నమోదయ్యాయి.

కారణం తెలియ లేదు..

యూపీఐ సేవల్లో 64 శాతం మనీ ట్రాన్స్ ఫర్, 28 శాతం పేమెంట్స్, 8 శాతం యాప్ సమమస్యలు తలెత్తాయి. అలాగే ఎస్బీఐలో 57 శాతం కస్టమర్లు మనీ ట్రాన్సక్షన్ జరపడంలో ఇబ్బంది వచ్చిందని కంప్లైంట్ ఇచ్చారు. 34 శాతం మొబైల్ బ్యాంకింగ్ సమస్యలను ఎదుర్కున్నామని చెప్పారు. అయితే  డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోవడానికి కారణమేంటని అనేది మాత్రం తెలియలేదు.  దీనిపై సంబంధిత బ్యాంకులు కానీ, యాప్స్ కానీ ఏమీ ప్రకటన చేయలేదు. నేషనల్ కార్పొరేట్ ఆఫ్ ఇండియా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు.  

 today-latest-news-in-telugu | upi

Also Read: RCB VS GT: లివింగ్ స్టోన్ మెరుపులు..గుజరాత్ టైటాన్స్ టార్గెల్ 170

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు