Supreme Court: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఎన్నికల హామీలపై కీలక ఆదేశాలు!

ఎన్నికల్లో రాజకీయపార్టీలు ఇస్తున్న ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరైనది కాదని చెప్పింది. వీటి కారణంగా ప్రజలు కష్టపడి పని చేసేందుకు ఇష్టపడట్లేదని తెలిపింది. ప్రజలను దేశ అభివృద్ధిలో భాగం చేయాలని సూచించింది.

New Update
Supreme Court

Supreme Court fires on Free guarantees

Supreme Court: దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు ఇస్తున్న ఉచిత హామీలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటి కారణంగా ప్రజలు కష్టపడి పని చేసేందుకు ఇష్టపడట్లేదని తెలిపింది. ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరైనది కాదని పేర్కొంది. ప్రజలను దేశ అభివృద్ధిలో భాగం చేయాలని సూచించింది. ఈ మేరకు పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ బీఆర్‌.గవై, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 

ఉద్దేశం మంచిదే కానీ..

ఈ మేరకు ఎన్నికల్లో నాయకులు ఇచ్చే ఉచిత పథకాల హామీలు మంచివి కావు. ఉచితంగా రేషన్‌, డబ్బులు అందుతున్నాయని జనాలు పని చేయడం మానేస్తారు. అయితే ప్రజలకు సౌకర్యాలు అందించాలనే ఉద్దేశం మంచిదే కానీ జనాలను దేశ అభివృద్ధిలో భాగం చేయాలని తెలిపింది. నిరాశ్రయులైన వారిని ప్రధాన స్రవంతి సమాజంలో చేర్చాలి. దేశాభివృద్ధికి దోహదపడటానికి అనుమతించాలి. వారి పట్ల మీకున్న శ్రద్ధను మేము చాలా అభినందిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: ఆరోగ్యం సహకరించకున్నా ఆలయాల సందర్శన.. కారణం అదే.. పవన్ కీలక ప్రకటన!

అయితే కేంద్ర ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన మిషన్‌ను పూర్తిచేసే పనిలో ఉందని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి న్యాయస్థానానికి తెలిపారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పలు సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. దీంతో నిర్మూలన మిషన్‌ ఎంతకాలం పాటు పనిచేస్తుందో తమకు స్పష్టతనివ్వాలని కోర్టు ఆదేశించింది. మరో 6 వారాల తర్వాత దీనిపై విచారణ జరిపస్తామని చెప్పింది. 

ఇది కూడా చదవండి: Lavanya: షాకింగ్ న్యూస్.. పోలీస్ బాస్‌తో లావణ్య రాసలీలలు.. వీడియో వైరల్!

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, భార్యతోపాటు భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియాలో పర్యటించనున్నారు. ఇండియాలో ప్రధాని మోదీతో సమావేశం అవ్వనున్నారు.

New Update
JD vance

JD vance

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియా పర్యటన ఫిక్స్ అయ్యింది. ఆయా దేశాల ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతల గురించి చర్చిస్తారని వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఓ ప్రకటన విడుదల అయ్యింది.

Also read: bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి

ఇండియాలో ఆయన ప్రధాని మోదీని కలపనున్నారు. అమెరికా పర్యటనలో మోదీ జెడి వాన్స్‌ ఫ్యామిలీని కలిశారు. అప్పుడే ఆయన్ని ఇండియాకు ఆహ్వానించారు మోదీ. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను వారు సందర్శించనున్నారు. అలాగే రోమ్‌లో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో కూడా సమావేశమవుతారు.

Also read: Donald Trump: ట్రంప్ టార్గెట్ హార్వర్డ్.. యూనివర్సిటీపై తన స్టైల్లో జోకులు

Advertisment
Advertisment
Advertisment