Rahul Gandhi: ట్రంప్‌ సుంకాలు భారత్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయి: రాహుల్ గాంధీ

అమెరికా భారత్‌పై 26 శాతం ప్రతీకార సుంకం విధించించిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రం ఈ టారిఫ్‌లపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ సుంకాలు మన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తాయన్నారు.

New Update
Rahul Gandhi Criticises Trump's Tariffs

Rahul Gandhi Criticises Trump's Tariffs

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. భారత్‌పై 26 శాతం సుంకం విధించింది. అయితే తాజాగా దీనిపై కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రం ప్రభుత్వం ఈ టారిఫ్‌లపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలంటూ డిమాండ్ చేశారు. గురువారం లోక్‌సభలో ఆయన మాట్లాడారు. '' చైనా భారత్‌కు చెందిన 4 వేల కిలోమీటర్లకు పైగా భూభాగాన్ని ఆక్రమించింది. ఈ విషయంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చైనాకు లేఖ రాసినట్లు అక్కడి రాయబారి ద్వారా సమాచారం అందింది. ఈ భూభాగాన్ని వెనక్కి తీసుకోవాలని'' రాహుల్ గాంధీ అన్నారు.  

Also Read: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణశాఖ కీలక ప్రకటన!

అలాగే ట్రంప్‌ విధించిన టారిఫ్‌లపై కూడా స్పందించారు. భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు మన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తాయని పేర్కొన్నారు. కేంద్రం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎంపీ అనురాగ్ ఠాకూర్ బదులిచ్చారు. చైనా ఈ ప్రాంతాన్ని ఎవరి హయాంలో తీసుకుందో అందరికీ తెలుసన్నారు. డొక్లాపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్న సమయంలో చైనా అధికారులతో కలిసి ఎవరు సూప్ తాగారో తెలుసని అన్నారు. ఇలాంటి అంశాలపై రాజకీయలు చేయడం వల్ల ఫలితం ఉండదని తెలిపారు.

Also Read: సుప్రీం న్యాయమూర్తుల సంచలన నిర్ణయం.. ఆస్తుల ప్రకటన!

అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్‌లతో పోల్చి చూస్తే తాము సగం మాత్రమే వసూలు చేస్తున్నామని ట్రంప్ అన్నారు. ఈ క్రమంలోనే భారత్ తమ వాణిజ్య భాగస్వామి అని అంటూనే ట్రంప్ సుంకాలు విధించేశారు. భారత్‌ తమ ఉత్పత్తులపై సగటున 52 శాతం సుంకం విధిస్తోందని.. తాము 26 శాతం సుంకం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

 trump | national-news | india | tariff tax

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu

🔴Live News Updates:

TS: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

తెలంగాణలో నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన టైమ్ వచ్చేసింది. పాతదే అయినా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి చేసింది రవాణాశాఖ. సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. 

ts
High Security number plate

 

మీ వెహికల్ 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు తయారైందా...అయితే అర్జంటుగా వెళ్ళి నంబర్ ప్లేట్ మార్చుకోండి.  పై తేదీ కన్నా ముందు తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవాల్సిందేనని తెలంగాణ రవాణాశాఖ చెప్పింది.  దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నంబర్‌ ప్లేట్‌కు కనిష్ఠంగా రూ.320.. గరిష్ఠంగా రూ.800గా ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నంబర్‌ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేస్తున్నామని రవాణాశాఖ చెబుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 

కచ్చితంగా మార్చాల్సిందే..

పాత వాహనాలకు నంబర్ ప్లేట్ మార్చాల్సి బాధ్యత యజమానిదే అని తేల్చి చెప్పింది రవాణాశాఖ. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ మార్చుకోకపోతే వాహనాలను అమ్మాలన్నీ, కొనాలన్నా సాధ్యం కాదని తెలిపింది. అలాగే బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ లాంటివి కూడా లభించవు. పైగా సెప్టెంబర్ తర్వాత కొత్త నంబర్ ప్లేట్లు కనిపించకపోతే కేసులు కూడా నమోదు చేయనున్నారు.  ఇక ఈ నంబర్ ప్లేట్లు వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల దగ్గర కూడా చేయించుకోవచ్చును. దీనికి సంబంధించిన సమాచారం, నంబర్ ప్లేట్ ధరలు డీలర్ దగ్గర కనిపిచేలా చేయనున్నారు. వాహనదారులు ఈ ప్లేట్‌ కోసం www.siam.in వెబ్‌సైట్‌లో ..వాహన వివరాలు నమోదు చేసి బుక్‌ చేసుకోవాలి. కొత్త ప్లేట్‌ బిగించాక ఆ ఫొటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

Also Read:  Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

Advertisment
Advertisment
Advertisment