Doctor Suicide: నిన్న టెకీ..నేడు డాక్టర్‌..రెండు ఒకటే!

రాజస్థాన్‌లో హోమియోపతి డాక్టర్‌ అజయ్‌ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం ఇప్పుడు మరోసారి సంచలనంగా మారింది. అయితే అతడు రాసిన సూసైడ్ లేఖలో తన భార్య చిత్ర హింసలు పెడుతుందని ప్రస్తావించడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

New Update
hanging hyderabad

Rajasthan: నిన్నటికి నిన్న యావత్‌ దేశాన్ని ఆలోచింపజేసేలా చేసిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య ఘటన మరిచిపోకముందే అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ డాక్టర్ కూడా అలాగే తన భార్యపెట్టే హింసలు,చిత్ర హింసలు భరించలేక  సూసైడ్ లేఖ రాసి.. ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు.

Also Read: Ap: ఏపీ పై అల్పపీడన ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్త!

రాజస్థాన్ జోధ్‌పూర్ నగరంలో 35 ఏళ్ల హోమియోపతి డాక్టర్ అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు మరోసారి పెను సంచలనంగా మారింది. ఆత్మహత్యకు ముందు.. తన భార్య సుమన్‌పై ఆరోపణలు చేస్తూ రాసిన సుసైడ్ నోట్ లభించడం ఇప్పుడు బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసును గుర్తుకు తెస్తుంది. భార్యతోపాటు తనకు ఇంటి వివాదాలు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అజయ్ ఆ లేఖలో చెప్పుకొచ్చాడు. 

Also Read: Joe Biden: ఒక్కరోజే 1500 మందికి శిక్ష తగ్గింపు.. చరిత్ర సృష్టించిన బైడెన్

జోధ్‌పూర్‌లోని కీర్తి నగరంలో ఉన్న తన క్లినిక్‌లోనే డాక్టర్ అజయ్ ఉరి వేసుకుని కనిపించాడు.అయితే అజయ్ కు ఎన్ని కాల్స్ చేసినా.. స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు.. క్లినిక్‌కు వెళ్లి చూడగా.. ఉరేసుకొని కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన భార్య సుమన్.. తనను మానసికంగా తీవ్రంగా హింసించినట్లు పేర్కొన్నారు. 

Also Read: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

తన పోరాటాన్ని, నిరాశను ఆ సూసైడ్ లేఖలో వ్యక్తం చేశాడు.అజయ్‌, సుమన్‌లకు 7 ఏళ్ల క్రితం పెళ్లి కాగా.. వారికి 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆ బాలుడు సుమన్‌తో కలిసి జైపూర్‌లో నివసిస్తున్నాడు. అజయ్ ను సుమన్ చాలా కాలం నుంచి మానసికంగా వేధింస్తోందని.. మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వేధింపులే అజయ్ కుమార్ జీవితంలో తీవ్రంగా కుంగిపోయేలా చేసి.. ఒత్తిడికి గురి చేశాయని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. డాక్టర్ అజయ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. 

Also Read: UP Crime: ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. భార్య దారుణ హత్య

మూడు రోజుల క్రితం బెంగళూరుకు చెందిన టెకీ అతుల్ సుభాష్ .. 40 పేజీల సూసైడ్ లేఖ, ఓ సెల్ఫీ వీడియో తీసుకుని.. ఆ తర్వాత ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన గత 2, 3 రోజుల నుంచి దేశం మొత్తాన్ని ఆలోచింపజేస్తోంది. సెక్షన్ 498ఏ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని.. ఏకంగా లాయర్లే ఆందోళన వ్యక్తం చేస్తుండటం తీవ్ర చర్చకు తెర తీస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.

New Update
Mohan Bhagwat

Mohan Bhagwat

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన  ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. 

Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.   

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు. 

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

 mohan-bhagwat | attack in Pahalgam 

Advertisment
Advertisment
Advertisment