సీపీఎం సీనియర్ నేత ప్రకాశ్ కారత్‌కు కీలక బాధ్యతలు..

సీపీఎం నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేవరకు పొలిట్ బ్యూరోకు సెంట్రల్ కమిటీకి ఆ పార్టీ నేత ప్రకాశ్‌ కారత్ మధ్యంతర సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పార్టీ సభ్యులు కొత్త సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనున్నారు.

New Update
Prakash karat 2

సీపీఎం నేత ప్రకాశ్‌ కారత్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. సీపీఎం నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేవరకు పొలిట్ బ్యూరోకు సెంట్రల్ కమిటీకి ఆయన మధ్యంతర సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. ఢిల్లీలో జరిగిన సెంట్రల్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీతారం ఏచూరి ఆకస్మిక మరణంతో  ప్రస్తుతం సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మధురైలో సీపీఎం 24వ అఖిలభారత మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభల్లో కొత్త సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనున్నారు.

Also Read: అయిన వారే ఆగం చేస్తున్నారు.. చిన్నారులపై అఘాయిత్యాల కేసుల్లో షాకింగ్ విషయాలు!

CPM Elects Prakash Karat

ఎవరినీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. పొలిట్ బ్యూరోలో ఉంటూ ప్రజాఉద్యమంలో పాల్గొన్న వారు ఈ పదవికి రేసులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీవీ రాఘవులు, కేరళకు చెందిన బేబీ లేదా విజయ రాఘవన్‌, బెంగాల్‌కు చెందిన నీలోత్పల్‌ బసు, మహారాష్ట్రకు చెందిన అశోక్‌ ధావళే సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు