Delhi Earthquake: ఢిల్లీ భూకంపం .. ప్రజలకు మోదీ కీలక సూచనలు!

ఢిల్లీ భూ ప్రకంపనలపై స్పందించారు పీఎం మోదీ.  ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మరోసారి భూప్రకంపనలు వచ్చే సూచనలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

New Update
modi tweet

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం అందర్ని ఉలక్కిపడేలా చేసింది. ఉదయం 5:36 గంటలకు బలమైన భూ ప్రకంపనలు సంభవించడంతో గాఢ నిద్రలోఉప్న ప్రజలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఢిల్లీలో భూమి కంపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఎక్స్ వేదికగా  తెలిపింది.  కొన్ని సెకన్ల పాటు మాత్రమే  భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన జనం ఇళ్లలోంచి  బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ భూ ప్రకంపణలతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.  ఢిల్లీతో పాటుగా నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ సహా వివిధ ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. 

ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి 

భూ ప్రకంపనలపై రాజకీయ నాయకులు కూడా తమ తమ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఢిల్లీ నగర వాసులకు ధైర్యం చెబుతున్నారు.  తాజాగా పీఎం మోదీ ఢిల్లీ భూ ప్రకంపనలపై ఎక్స్ వేదికగా స్పందించారు.  ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని మోదీ సూచించారు. అంతేకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మరోసారి భూప్రకంపనలు వచ్చే సూచనలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని మోదీ ట్వీట్ చేశారు.  

ఢిల్లీలో భూకంపం తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజల భద్రత కోసం ఆకాంక్షించారు. ఢిల్లీలో భారీ భూకంపం వచ్చిందని, అంతా క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్ధించినట్లు అతిషి పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అతిషి పోస్ట్‌ను తిరిగి పోస్ట్ చేసి, 'అందరి భద్రత కోసం నేను ప్రార్థిస్తున్నాను' అని తన ట్వీట్ లో రాసుకొచ్చారు.  

Also Read :   కుంభమేళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్: లిస్ట్ ఇదే!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Marriage: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

తన కూతురి పెళ్లికి మరో 9 రోజుల సమయం ఉందనగా.. ఓ మహిళ కాబోయే అల్లుడితో లేచిపోవడం కలకలం రేపింది. పెళ్లి షాపింగ్‌కు వెళ్తున్నామని చెప్పి అత్తా, అల్లుడు.. 2.5 లక్షల నగదు, బంగారంతో జంప్ అయ్యారు. దీంతో మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

New Update
Woman Elopes With To Be Son-in-Law Days Before Wedding

Woman Elopes With To Be Son-in-Law Days Before Wedding

ఉత్తరప్రదేశ్‌లో అందరూ నొరెళ్లబెట్టే సంఘటన చోటుచేసుకుంది. తన కూతురి పెళ్లికి మరో 9 రోజుల సమయం ఉందనగా.. ఓ మహిళ కాబోయే అల్లుడితో లేచిపోవడం కలకలం రేపింది. పెళ్లి షాపింగ్‌కు వెళ్తున్నామని చెప్పి అత్తా అల్లుడు ఇద్దరూ జంప్ అయిపోయారు. అలాగే 2.5 లక్షల నగదు, బంగారం కూడా ఎత్తుకెళ్లారు. ఇరు కుటుంబాలు ఒక్కసారిగా కంగుతిన్నాయి. చివరికీ పారిపోయిన మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Also Read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

ఇక వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్‌లోని అలీగర్ జిల్లాలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. కూతురికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. వరుడు దొరకడంతో పెళ్లి సంబంధం ఖాయమైపోయింది. ఏప్రిల్ 16న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే కాబోయే పెళ్లి కొడుకు తరచుగా తన అత్తవారింటికి వచ్చేవాడు. అయితే ఓసారి అతడు తనకు కాబోయే అత్తకు మొబైల్ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ తర్వాత వీళ్లద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. 

Also Read: ఓరి కామాంధుడ.. ఆవుని కూడా వదల్లేదు కదరా.. ఛీ ఛీ- వీడియో వైరల్

మరో 9 తొమ్మిది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. అంతలోనే ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. పెళ్లి షాపింగ్‌కు వెళ్లొస్తామని చెప్పి అత్త, అల్లుడు పారిపోయారు. 2.5 లక్షల నగదు, బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లారు. చివరికి ఆ పారిపోయిన మహిళ భర్త దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

Also Read: ట్రంప్‌ టారిఫ్‌ దెబ్బకి మెరుగుపడుతున్న భారత్-చైనా సంబంధాలు

telugu-news | rtv-news | national-news | uttar-pradesh

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు