Pariksha pe Charcha: కష్టాన్ని ఇష్టంగా చేసుకోండి.. విద్యార్థులతో ప్రధాని ఇంట్రెస్టింగ్ చిట్ చాట్

పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ నేడు విద్యార్థులతో సమావేశమయ్యారు. ఢిల్లీలో సుందరవనంలో ప్రధాని కొందరు విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోదీ విద్యార్థులకు కీలక సూచనలు కూడా చేశారు. ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.

New Update
Modi students

Modi students Photograph: (Modi students)

ప్రధాని మోదీ విద్యార్థులతో పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా కలిశారు. ప్రతీ ఏటా పరీక్షలు వచ్చే ముందు ప్రధాని మోదీ విద్యార్థులను కలుస్తారు. దీన్నే పరీక్షా పే చర్చ అని పిలుస్తారు. అయితే ఈ క్రమంలో ప్రధాని మోదీ నేడు ఢిల్లీలో సుందరవనంలో కొందరు విద్యార్థులను కలిశారు. పచ్చని ప్రకృతి మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మోదీ విద్యార్థులకు కీలక సూచనలు కూడా చేశారు. కష్టమైన సబ్జెట్‌నే ఇష్టంగా మార్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ఇది కూడా చూడండి: Mahakumbhabhishekam : కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం ..42 సంవత్సరాల తర్వాత మరోసారి....

ఇది కూడా చూడండి: Cinema: పుష్ప-2 పై తొలిసారి నోరు విప్పిన మెగాస్టార్.. అందరూ కలిసి ఉండాలంటూ.. సెన్సేషనల్ కామెంట్స్!

పలువురు ప్రముఖులు కూడా..

ప‌రీక్షా పే చ‌ర్చ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. ఆధ్యాత్మిక గురువు సద్గురు, బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, ప్రముఖ క్రీడాకారులు మేరీ కోమ్, 12th ఫెయిల్ సినిమా హీరో విక్రాంత్ మాస్సే పాల్గొంటారు. వీరు విద్యార్థుల‌తో మాట్లాడి.. ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిట్కాలు కూడా అందజేయనున్నారు.

ఇది కూడా చూడండి: Ys Jagan:వైఎస్ జగన్‌ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ..ఏపీ  పోలీసుల కీలక నిర్ణయం!

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్‌..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nainar Nagendran: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పార్టీ నేత, తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు.

New Update
Nainar Nagendran declared BJP Tamil Nadu unit president

Nainar Nagendran declared BJP Tamil Nadu unit president

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పార్టీ నేత, తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే అధ్యక్ష పదవికి నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏకపక్షంగా పదవి ఆయనకే ఖరారైపోయింది. ఈ ఎన్నిక వెనుక అమిత్ షా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

Also Read: రేయ్ పాపం రా.. 13 కుక్కలను రేప్ చేసిన దుర్మార్గుడు- లైవ్ వీడియో వైరల్?

1960లో కన్యాకుమారి జిల్లా వడివీశ్వరంలో నాగేంద్రన్ జన్మించారు. 2001, 2011, 2021 ఎన్నికల్లో తిరునల్వేలి స్థానం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2001- నుంచి 2006 సమయంలో ఏఐడీఎంకే పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2017లో ఏఐడీఎంకేను వీడి బీజేపీలో చేరారు. 2020 జులై నుంచి పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటున్నారు. జయలలిత, పన్నీరుసెల్వం ప్రభుత్వాల్లో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 

Also Read: సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ బిగ్ షాక్..

ప్రభుత్వ పాలనలో అనుభవం, ప్రజాధారణ, రాజకీయ వ్యూహాలపై పట్టుఉండటంతో అధిష్ఠానం ఆయన వైపే మొగ్గు చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏఐడీఎంకే, బీజేపీలను సమన్వయం చేసుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తారని అంటున్నారు. అయితే ఇటీవల రామేశ్వరంలో పాంబన్ వంతెన ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వేదికపై ప్రధాని మోదీతో పాటు నాగేంద్రన్ కనిపించారు. వాస్తవానికి బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులు కావాలంటే పదేళ్ల పాటు ప్రాథమిక సభ్యత్వం ఉడాలి. కానీ పార్టీ అభివృద్ధికి నాగేంద్రన్ కృషి చేయడం వల్ల  ఆయనకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. 

telugu-news | rtv-news | national-news | bjp

Advertisment
Advertisment
Advertisment