E85 Petrol: వాహనదారులకు గుడ్ న్యూస్... రూ.82 లకే లీటర్ పెట్రోల్.. ఎక్కడంటే?

న్యూఢిల్లీలో సరికొత్త 'E85' ఇంధనాన్ని అధికారికంగా విడుదల చేశారు. ఈ సరికొత్త ఇంధనం ధర లీటరు కేవలం రూ. 82 లు మాత్రమే. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సాధారణ E20 పెట్రోల్‌తో పోలిస్తే ఇది ఏకంగా రూ.20లు తక్కువ.

New Update
petrol, diesel prices likely to hike after polls diesel prices likely to hike after polls

petrol, diesel prices likely to hike after polls

న్యూఢిల్లీలో సరికొత్త 'E85' ఇంధనాన్ని అధికారికంగా విడుదల చేశారు. ఈ సరికొత్త ఇంధనం ధర లీటరు కేవలం రూ. 82 లు మాత్రమే. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సాధారణ E20 పెట్రోల్‌తో పోలిస్తే ఇది ఏకంగా రూ.20లు తక్కువ. ఈ చౌక ఇంధనం అందుబాటులోకి రావడం వల్ల సాధారణ వాహనదారులకు, ముఖ్యంగా రోజువారీ ప్రయాణికులకు జేబు భారం చాలా వరకు తగ్గనుంది.

ఇది కూడా చూడండి: Mina Ala Fahal terminal : ఒమన్‌ ఆయిల్ టర్మినల్‌పై డ్రోన్‌ దాడి.. నిలిచిపోయిన చమురు లోడింగ్!

అసలు ఏంటి ఈ E85 ఇంధనం

ఈ ఇంధనంలో 85 శాతం ఇథనాల్,15 శాతం సాధారణ పెట్రోల్ కలయికతో రూపొందించిన ప్రత్యేకమైన బయో-ఫ్యూయల్. చెరకు పిప్పి, పాడైపోయిన ధాన్యాలు, వ్యవసాయ వ్యర్థాల నుంచి ఈ ఇథనాల్‌ను తయారు చేస్తారు. మన దేశంలోనే సొంతంగా ఈ ఇథనాల్ ఉత్పత్తి పెరగడం వల్లే ప్రభుత్వం ఇంత తక్కువ ధరకే ఇంధనాన్ని అందించగలుగుతోంది. దీనివల్ల విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే ముడి చమురు భారం దేశంపై గణనీయంగా తగ్గుతుంది.

ఈ E85 ఇంధనాన్ని అన్ని రకాల సాధారణ వాహనాలలో నేరుగా వాడటానికి వీల్లేదు. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన 'ఫ్లెక్స్-ఫ్యూయల్' ఇంజన్లు కలిగిన కార్లు, బైకులలో మాత్రమే ఈ ఇంధనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ E85 ఇంధనం వల్ల కేవలం డబ్బు ఆదా అవ్వడమే కాకుండా.. పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే దీనివల్ల వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని చాలా వరకు తగ్గుతుంది.

Advertisment
తాజా కథనాలు