ఢిల్లీలో రైతుల పాదయాత్ర.. భారీగా ట్రాఫిక్ జామ్

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మరోసారి రైతులు ఢిల్లీ బాట పట్టారు. పార్లమెంటును ముట్టడించేందుకు వేలాది మంది రైతులు అక్కడికి పాదయాత్ర చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు మోహరించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.

New Update
FARMERS

రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మరోసారి రైతులు ఢిల్లీ బాట పట్టారు. పార్లమెంటును ముట్టడించేందుకు వేలాది మంది రైతులు అక్కడికి పాదయాత్ర చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లో ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. రైతుల పాదయాత్రతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారతీయ కిసాన్ పరిషత్ (BKP) నేత సుఖ్‌బీర్ ఖలీఫా మీడియాతో మాట్లాడారు. కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం.. న్యాయమైన పరిహారం, మెరుగైన ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ రైతులు పాదయాత్ర చేపట్టనున్నారని పేర్కొన్నారు. 

Also Read: సంక్రాంతి తర్వాత రైతుభరోసా.. కొత్త రూల్స్ ఇవే.. వారికి కట్?

అయితే ఢిల్లీలో రైతుల ఆందోళనలపై తమకు ముందస్తు సమాచారం అందినట్లు తూర్పు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పార్లమెంటులో సమావేశాలు జరుగుతున్నందువల్ల రైతుల పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వలేమని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిస్థితికి విఘాతం తలెత్తకుండా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూస్తామని చెప్పారు.

Also Read: మహారాష్ట్రలో సీఎం ఎన్నిక.. బీజేపీ ఎమ్మెల్యేలకు హైకమాండ్ కీలక ఆదేశాలు!

 డిసెంబర్ 6 నుంచి తమ సభ్యులు ఢిల్లీ వైపు పాదయాత్ర చేస్తారని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ మార్చ్ తెలిపారు. కేరళ, ఉత్తరాఖండ్, తమిళనాడు రాష్ట్రాల రైతు సంఘాలు కూడా తమ అసెంబ్లీల వైపు పాదయాత్రలు చేసేందుకు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చిచెబుతున్నారు. 

 

Also Read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న తన ఇద్దరు పిల్లలకు ఆపరేషన్ వరకు సమయం ఇవ్వాలని ఓ పాకిస్థానీ ఇండియా ప్రభుత్వాన్ని కోరాడు. మెరుగైన వైద్యం కోసం ఇండియాకి వచ్చామని.. మధ్యలోనే వెళ్లిపోమంటున్నారని ఆవేదన చెందాడు. చికిత్సకు ఇప్పటికే రూ.కోటి ఖర్చు అయ్యిందన్నారు.

New Update
Surgeries

Surgeries

తన ఇద్దరు పిల్లల ఆపరేషన్ కోసం ఓ పాకిస్థానీ ఇండియా ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. పుట్టుక నుంచి తన ఇద్దరు పిల్లలు గుండె సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వారికి మెరుగైన వైద్యం కోసం ఇండియాకి వచ్చారు. ఇప్పుడు పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్ కాకుండానే మధ్యలో వెళ్లాలంటున్నారని ఆవేదన చెందుతున్నారు. 

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

కొంత సమయం ఇవ్వాలని..

చికిత్స పూర్తి చేయడానికి అనుమతించాలని ప్రభుత్వాలను కోరాడు. ఢిల్లీలో అధునాతన చికిత్స ఉందని, అందుకే చికిత్సకు ఇండియాకు వచ్చినట్లు తెలిపాడు. ఇంకో వారం రోజుల్లో శస్త్రచికిత్స జరగనుంది. అప్పటి వరకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే పిల్లల వైద్యానికి రూ.కోటి ఖర్చు అయ్యిందని, ఇప్పుడు మధ్యలోనే చికిత్స ఆపేస్తే.. పిల్లల ప్రాణాలకే ప్రమాదమని తండ్రి ఆవేదన చెందుతున్నాడు. ఇంకో రెండు వారాల సమయం ఇస్తే చికిత్స అన్ని పూర్తి చేసుకుని వెళ్లిపోతామని తండ్రి ప్రభుత్వాన్ని కోరాడు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment