లవర్‌తో పారిపోయిన వివాహిత.. ఆత్మహత్య ప్లాన్.. ట్విస్టులే ట్విస్టులు!

గుజరాత్‌లో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ప్రియుడితో పారిపోవాలని ప్లాన్ వేసింది. ఓ వృద్ధుడిని చంపి నిప్పంట్టించింది. అందులో తన బట్టలు వేసింది. దీని కారణంగా తను చనిపోయినట్లు ఫ్యామిలీని నమ్మించింది. రెండు నెలల తర్వాత ఆ ప్రేమ జంట పోలీసులకు చిక్కింది.

New Update
Gujarat

ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి పారిపోయేందుకు స్కెచ్ వేసింది. ఇందులో భాగంగానే ఆ ప్రేమ జంట తమకు తెలియని ఓ వృద్ధుడిని చంపి నిప్పంట్టించింది. అందులో ఆ మహిళ తన బట్టలు, చెప్పులు వేసింది. దీని కారణంగా తాను చనిపోయినట్లు ఫ్యామిలీని నమ్మించింది. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్లు వేరోక ప్రాంతానికి వెళ్లి రెండు నెలలు కలిసి జీవించింది. ఆ తర్వాత పోలీసులకు చిక్కారు. మొత్తంగా సినిమా రేంజ్‌లో ఆ ప్లాన్ వేసిందీ ప్రేమ జంట. వివరాల్లోకి వెళితే..

సినిమాను తలపించే ట్విస్టులు

గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రామి కేరియా, అనిల్ గంగన్ అనే జంట గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇద్దరూ కలిసి పారిపోతున్న క్రమంలో ఓ వృద్ధుడిని చంపేసి నిప్పంటించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ వృద్ధుడికి నిప్పంటించిన తర్వాత వివాహిత రామి తన బట్టలు, చెప్పులు, ఫోన్‌ను ఆ మంటల్లో శవం వద్ద పడేసింది. అంటే రామి మంటల్లో చనిపోయిందని తన ఫ్యామిలీ, ఇతరులను నమ్మించాలనుకుంది. ఆ తర్వాత తన లవర్‌తో హ్యాపీగా జీవించాలనుకుంది. అనుకున్న ప్లాన్ ప్రకారమే అంతా జరిగింది. 

ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన బెట్టింగ్.. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు

జూలై 3న ప్లాన్ సక్సెస్ అయింది. ఆ తర్వాత గ్రామం వదిలి ఆ జంట పారిపోయింది. ఆ మరుసటి రోజు రామి ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో అనిల్ వచ్చి గమనించాడు. రామి మంటల్లోనే కాలి చనిపోయిందని ఫ్యామిలీ కూడా నిజంగానే అనుకున్నారు. అనిల్ కూడా హమ్మయ్య తమకు ఇక ఎలాంటి అడ్డూ లేదని నిర్ణయానికి వచ్చాడు. దీంతో రెండు నెలల తర్వాత రామి, అనిల్ కచ్‌కి వచ్చి ఒక రూమ్‌లో అద్దెకు దిగారు.

ఇది కూడా చదవండి: యువకుడి ప్రాణం తీసిన డీజే సౌండ్.. ఏమైందంటే?

కానీ ఏమైందో ఏమో కానీ.. తమ ప్లాన్ సక్సెస్ కాలేదని భావించారు. దీంతో సెప్టెంబర్ 27న రామి తన తప్పును అంగీకరించమని తండ్రి వద్దకు వచ్చింది. జరిగిందంతా చెప్పింది. కానీ రామి తండ్రి అంగీకరించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?

కాశ్మీర్ ఉగ్రదాడి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.అపార నష్టంతో కుమిలిపోతున్న మనం రగిలిపోతుంటే..పాకిస్తాన్ మాత్రం పొగరుతో కాలు దువ్వుతోంది. యుద్ధం తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే గెలుపెవరిది?ఎవరి బలం ఎంతుంది?

New Update
Indian Army

Indian Army

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ లలో పరిస్థితి మారిపోయింది. ఒక్క ఉగ్రదాడితో రెండు దేశాలు అల్లకల్లోలం అయిపోయాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. 26మందిని పోగొట్టుకుని భారత ప్రజలు రగిలిపోతున్నారు. ప్రభుత్వం కూడా దీనిని సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్ మీద కస్సుబుస్సుమంటోంది. ఆ దేశాన్ని అన్ని విధాలా దిగ్భంధనం చేస్తూ ఐదు కఠిన నిర్ణయాలను తీసుకుంది. పోనీ అటు నుంచి పాకిస్తాన్ ఏమైనా తగ్గిందా అంటే..అదీ లేదు. ఆ దేశం కూడా యద్ధానికి సిద్ధం అంటూ కయ్యానికి కాలు దువ్వుతోంది. అసలు ఇదంతా జరగడానికి తామే కారణం అయినా కూడా ఆ విషయాన్ని ఒప్పుకోకుండా పొగరుగా మాట్లాడుతోంది. ఇండియా ఒక్కటేనా నిర్ణయాలు తీసుకోగలదు అంటూ వాళ్ళు కూడా సేమ్ టూ సేమ్ కాపీ కొట్టేశారు. దీంతో యుద్ధం తప్పదనే సూచనలు చాలా గట్టిగానే కనిపిస్తున్నాయి. దీని కోసం రెండు దేశాలూ సిద్ధమైపోతున్నాయి కూడా. భారత ఆర్మీ ఛీప్ రేపు కాశ్మీర్ కూడా వెళుతున్నారు. అక్కడ బలగాలు పర్యవేక్షించడంతో పాటూ ఇతర ఏర్పాట్లను కూడా చూడనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో యుద్ధమే కనుక జరిగితే ఏ దేశం గెలుస్తుంది...ఎవరి బలం ఎంత అనే చర్చలు జరుగుతున్నాయి. 

భారత్, పాక్ సైనిక బలాలు ఇవే..

ఇండియా, పాకిస్తాన్ ల మధ్య ఇదే మొదటిసారి కాదు. ఇలా దాడులు జరగడం...రెండు దేశాలు యుద్ధానికి రెడీ అవడం చాలాసార్లే జరిగింది. పాక్ చేసిన పనులకు భారత్ అన్ని సార్లూ గట్టిగానే జవాబు చెప్పింది. ఎప్పుడూ విజయం కూడా మనవైపే ఉంటుంది కూడా. అయితే ఈ సారి యుద్ధం జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి. ఎవరికి గెలిచే ఛాన్స్ ఉందంటే..కచ్చితంగా భారత్ కే అని చెప్పాలి. ఎందుకంటే అన్ని రకాలుగా పాకిస్తాన్ కంటే భారత్ బలంగా ఉంది. 

భారత ఆర్మీ సైనికులు...పాక్ ఆర్మీ సైనికుల కంటే దాదాపు రెండింతలు ఉన్నారు.  భారత సైనికులు 14, 55, 550 మంది ఉంటే పాక్ సైనికులు 6, 54,00 మంది ఉన్నారు.  ఇండియా దగ్గర ఆరు వైమానిక ట్యాంకర్లు ఉంటే పాక్ దగ్గర నాలుగు ఉన్నాయి. ఇక అణు జలాంతర్గాముల విషయానికి వస్తే భారత్ దగ్గర 2893 ఉన్నాయి. పాక్ దగ్గర 121 మాత్రమే ఉన్నాయి. గగనతలం సంగతి చూస్తే..ఇండియా దగ్గర 2,229 ఎయిర్ క్రాఫ్ట్స్, 513 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అదే పాకిస్తాన్ దగ్గర 1, 399 ఎయిర్ క్రాఫ్ట్స్, 328 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటూ భారత్ దగ్గర 1.15 మిలియన్ రిజర్వ్, 25 లక్షల పారా మిలటరీ బలగాలు అదనంగా ఉన్నాయి. 

ఆర్థిక బలం..

ఇవన్నీ ఒక ఎత్తైతే ఆర్థికంగా పాకిస్తాన్ కంటే భారత్ చాలా ఉన్నతంగా ఉంది. ఇప్పటికప్పుడు యుద్ధం వచ్చినా దాన్ని ఇండియా తట్టుకోగలదు. దానికి కావాల్సిన ఏర్పాట్లను వెంటనే చేయగలదు. ప్రపంచ దేశాలు కూడా భారత్ కు సహాయం చేయడానికి ముందుకు వస్తాయి. ముఖ్యంగా పెద్దన్న అమెరికా అందరి కంటే ఈ విషయంలో ముందుంటుంది. కానీ మరి పాకిస్తాన్ సంగతేంటి. ఆ దేశం చాలా రోజులుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. తినడానికి తిండి కూడా లేకుండా బాధలు పడుతోంది. ఇలాంటి సమయంలో ఆ దేశం ఫుల్ ఎఫెర్ట్ పెట్టి యుద్ధం చేయగలదా...ఒకవేళ చేసినా...యుద్ధం ముగిశాక వచ్చే పరిసనామాలను తట్టుకోగలదా అనే చాలా పెద్ద ప్రశ్నే. పైగా ప్రపంచ దేశాలు పాకిస్తాన్ కు ఏ విధంగానూ సహాయం చేయవు. ఆఖరుకి కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత తాలిబాన్లు కూడా భారత్ కు సపోర్టు చేశారు. పాక్ చేసింది తప్పు అంటూ మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ యుద్ధం అంటూ ఎగదోయడం సరైన విషయం కాదు. దీన్ని ఆ దేశం ఎంత త్వరగా తెలుసుకుంటే...దానికి అంత మంచిది. 

 today-latest-news-in-telugu | india | pakistan | war | army

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు