నువ్వేం శాడిస్ట్ మొగుడివిరా.. భార్య విడాకులు అడిగిందని చలాన్లతో రివేంజ్!

తన భార్య విడాకులు అడిగిందని ఓ భర్త ఆమెపై  రివేంజ్ ప్లాన్ చేశాడు. తన భార్యపై ఉన్న కోపంతో ఆమె పేరుపై ఉన్న బైక్ పై చలాన్లు వచ్చేటట్లు ప్రవర్తించాడు. ఈ విచిత్రమైన సంఘటన బీహార్ లో చోటుచేసుకుంది. విడాకులు అయ్యే వరకు బైక్ ను తిరిగి ఇవ్వనని ఆమెకు చెప్పేశాడు.

New Update
bike challans

bike challans

తన భార్య విడాకులు అడిగిందని ఓ భర్త ఆమెపై  రివేంజ్ ప్లాన్ చేశాడు. తన భార్యపై ఉన్న కోపంతో ఆమె పేరుపై ఉన్న బైక్ పై చలాన్లు వచ్చేటట్లు ప్రవర్తించాడు. ఈ విచిత్రమైన సంఘటన బీహార్ లో చోటుచేసుకుంది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని కాజీ మొహమ్మద్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన  ఓ  మహిళకు గతేడాది పాట్నాకు చెందిన వ్యక్తితో వివాహం చేసుకుంది. వారి పెళ్లి సమయంలో మహిళ తండ్రి వరుడికి ఒక  బైక్ ను కట్నం కింద ఇచ్చాడు, అయితే దానిని తన కుమార్తె పేరుతో రిజిస్టర్ చేయించాడు. 

అయితే పెళ్లి అయిన కొన్ని నెలలకు దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి, దీంతో ఆ మహిళ తన భర్త ఇంటిని వదిలి తన పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రావాలని భర్త కోరిన ఆమె వెళ్లలేదు. గొడవలు మరింతగా పెరగడంతో వ్యవహారం ఏకంగా విడాకుల వరకు వెళ్లింది.  దీంతో భార్యపై పగపెంచుకున్న మహిళ భర్త రివేంజ్ ప్లాన్ చేశాడు.

Also Read :  Swati Maliwal : పార్టీ ఓడిపోతే సిగ్గులేకుండా డ్యాన్స్ చేస్తావా.. సీఎంపై స్వాతి ఫైర్!

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ

 ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆమె బైక్ కు చలాన్లు వచ్చేటట్లు ప్రవర్తించాడు.  మొదట్లో వచ్చిన ఛలాన్లకు ఆమె డబ్బులు కడుతూ వచ్చింది.  కానీ ఇవి తరచుగా పెరగడంతో  చివరికి ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించింది. మూడు నెలల్లో ఏకంగా 40కి పైగా చలాన్లు వచ్చాయని ఇవన్ని తన భర్త  కావాలనే చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది.  

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్తను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. బైక్ తనకు ఇవ్వాలని మహిళ కోరగా అందుకు ఆమె భర్త నిరాకరించాడు. విడాకులు అయ్యే వరకు బైక్ ను తిరిగి ఇవ్వనని చెప్పేశాడు.  దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. 

Also Read :  Delhi Elections Results : లక్కీ ఛాన్స్.. ఎన్నికలకు ముందు పార్టీ మారి గెలిచారు!

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.

New Update
Mohan Bhagwat

Mohan Bhagwat

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన  ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. 

Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.   

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు. 

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

 mohan-bhagwat | attack in Pahalgam 

Advertisment
Advertisment
Advertisment